రెండు తెలుగు రాష్ట్రాలకూ రెండు వేర్వేరు ధోరణులు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా విభిన్న ఆర్థిక పరిస్థితులనూ, స్థితిగతులనూ చవి చూస్తున్నాయి. గతం కన్నా వేగంగా పనిచేసే క్రమానికి ఇటు టీజీ సర్కారు కానీ అటు ఏపీ సర్కారు కానీ ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గ విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ దశలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య దూరం పెరిగే అవకాశాలు రాకూడదు. పరిణామాలు రాకూడదు.
ఎవరి పాలన వారిదే కనుక పాలించి నిర్దేశించి ఎదుగుదల ఆశించడంలో తప్పే లేదు. కానీ అనవసర వ్యాఖ్యల కారణంగా లేదా అత్యుత్యాహం కారణంగా కొన్ని వివాదాలు మోయక తప్పదు. ఈ నేపథ్యంలో నిన్నటి వేళ క్రెడాయ్ మీట్ అందుకు వేదికగా నిలిచింది. ఈ వేదికపై నుంచి కేసీఆర్ చేసిన వేడి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజుకునేలా చేశాయి. మాటలు మంటలు ఎపిసోడ్ నిన్న చాలా సేపు కొనసాగింది రాజకీయంలో ! అయితే కేటీఆర్ తనదైన వ్యాఖ్యలు తప్పు అని తెలుసుకుని దిగివచ్చారు. వివాదం కూడా సర్దుమణగనుంది.
ఇవాళ నేను చేసిన అమాయకపు వ్యాఖ్య నా ఆంధ్రా సోదరులను బాధ పెట్టి ఉంటుంది. నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మంచి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నాను. ఇకపై కూడా అదేవిధంగా మా బంధం ఉంటుంది. ఆయన నేతృత్వంలో పొరుగు తెలుగు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా.. అని కేటీఆర్ రాసుకొచ్చారు ట్విటర్ లో.. ! దీంతో నిన్న రేగిన తుఫాను ఇకపై ఆగిపోతుందని భావించాలి. లేదా వైసీపీ శ్రేణులు శాంతిస్తాయి అని కూడా భావించాలి మరియు ఆశించాలి. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణతో సఖ్యత, సత్సంబంధాలే ప్రామాణికం కావాలి.
ఓ విధంగా ఏపీ సీఎం జగన్ తో కానీ లేదా మునుపటి సీఎం చంద్రబాబుతో తెలంగాణ సర్కారు తగువులు పెట్టుకున్నది లేదు. ఆస్తుల పంపకం పూర్తి కాకపోయినా కూడా ఎవరి దారి వారిదే అన్నవిధంగా ఉన్నారు. అన్నదమ్ములే కానీ కొట్టుకు చచ్చేంత కోపాలతో అయితే ఎవ్వరూ లేరు. ఆంధ్రా ప్రజలను బాగానే చూసుకుంటున్నారు కేసీఆర్. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంత నాయకులతో అక్కడి నేతలకు సత్సంబంధాలే ఉన్నాయి. కనుక కేటీఆర్ చేసిన అమాయకపు వ్యాఖ్య దుమారం రేపినా అవన్నీ క్షణికాలే అని గుర్తిస్తే మేలు.
This post was last modified on April 30, 2022 10:51 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…