Political News

కొడాలిపై చంద్ర‌బాబు కొత్త అస్త్రం

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని.. గుడివాడ నియోజ‌క వ‌ర్గంలో విజ‌యం సాధించి.. చంద్ర‌బాబుకు.. కానుకగా ఇచ్చేందుకు యువ‌నాయ‌కుడు రెడీ అయ్యార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌ను హైలెట్ చేసేందుకు పార్టీ ఐ-టీడీపీ విభాగానికి ఆదేశాలు కూడా అందాయ‌ని అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. గుడివాడ‌లో విజ‌యం అత్యంత అవ‌స‌రం. ఇప్ప‌టికే ప‌లుమార్లుగా టీడీపీ ఇక్క‌డ ప‌రాజ‌యం పాల‌వుతోంది.

పైగా.. ఇక్క‌డ నుంచి గెలిచిన కొడాలి నాని.. టీడీపీకి కంట్లో న‌లుసుగా మారిపోయారు. త‌న‌ను ఓడించే టీడీపీ నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు పుట్ట‌లేద‌ని కూడా అంటున్నారు. అంతేకాదు.. ఎక్క‌డ ఎప్పుడు మాట్లాడినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఆయ‌న నోరు చేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించార‌ని.. పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక్క‌డి ప్రాంతానికే చెందిన యువ నాయ‌కుడు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన శిష్ట్లా లోహిత్‌ను పోటీ చేయించాల‌ని భావిస్తున్నార‌ట‌. శిష్ట్లా లోహిత్ ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త‌కాదు. ఆయ‌న తండ్రి కూడాగ‌తంలో రాజ‌కీయాలు చేశారు. పైగా ఆద‌ర్శ‌నేత‌గా కూడా ఆయ‌న‌కు పేరు ఉంది. దీనికితోడు.. రియ‌ల్ ఎస్టేట్ స‌హా.. ప‌లు వ్యాపారాల్లో లోహిత్ మంచి ఫాంలో ఉన్నారు.

ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతోపాటు.. త‌న సామాజిక‌వర్గంలోను.. వ్యాపార ప‌రంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ ఆయ‌న మంచి పేరు తెచ్చుకున్నారు. అంద‌రిలోనూ.. గుర్తింపు కూడా పొందారు. వ‌య‌సు కూడా చాలా చిన్న‌వ‌యసు కావ‌డం గమ‌నార్హం. దీంతో.. లోహిత్‌ను గుడివాడ‌లో నిలబెట్ట‌డం ద్వారా.. డిఫ‌రెంట్ లుక్‌తో రాజ‌కీయాలు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

వాస్త‌వానికి గుడివాడ‌లో టీడీపీకి నాయ‌కులు ఉన్నా.. వారు ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు వేయించుకోలేక పోతున్నార‌ని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. అయితే.. వారిని ప‌క్క‌న పెట్ట‌కుండా.. లోహిత్ కు టికెట్ ఇచ్చి.. పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. వారికి ప్ర‌భుత్వంలోనూ కార్పొరేష‌న్ ప‌ద‌వులు అప్ప‌గించాలని ఆలోచిస్తున్నార‌ట‌.

లోహిత్ అయితే.. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు.. ఎలాంటి ఆరోప‌ణ‌లు లేని సౌమ్యుడు కావ‌డంతో గుడివాడ ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకుని.. కొత్త నాయ‌కుడికి.. ప్రాధాన్యం ఇస్తార‌ని భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on April 30, 2022 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

23 minutes ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

2 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

2 hours ago

స్వయంభు సౌండ్ చాలా పెంచాలి

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…

2 hours ago

రోహిత్ ర‌చ్చ‌: బీఆర్ఎస్‌ దిద్దుబాటు చ‌ర్య‌లు!

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మైన వేళ తెలంగాణ ప్ర‌ధాన ప్రతిప‌క్షం బీఆరఎస్‌ పార్టీ ఇరుకున ప‌డిన విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్…

3 hours ago

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

5 hours ago