Political News

తండ్రిలాగే కేటీఆర్ పిట్ట క‌బుర్లు.. ఏపీ మంత్రి కౌంట‌ర్‌

ఏపీలో పాల‌న స‌రిగాలేద‌ని.. రోడ్లు గుంత‌లు ప‌డ్డాయ‌ని, ప్ర‌మాదాల‌తో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని.. ఇక‌, తాగేందుకు కూడా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నీళ్లులేవ‌ని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. ఏపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ జోగి ర‌మేష్ షాకింగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేటీఆర్‌, కేసీఆర్‌ల‌పై ఆయ‌న దుమ్మెత్తి పోశారు. ఇద్ద‌రికీ మైండ్ చెడిపోయింద‌ని అన్నారు. వారు ఏం మాట్ల‌డుతున్నారో.. వారికే అర్ధం కావ‌డం లేద‌న్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌కు జోగి స‌వాల్ రువ్వారు.

“కేటీఆర్‌.. నీకు క‌ళ్లు ఉంటే..  విజ‌య‌వాడ‌కు రా! వ‌చ్చి ..ఇక్క‌డ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేస్తోందో చూడు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లోద్దు“ అని వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ‌కు రావాల‌ని.. కేటీఆర్‌కు స‌వాల్ రువ్వారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తెలంగాణ‌లో కూడా అమ‌లు చేయాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయ‌ని.. అందుకే త్వ‌ర‌లోనే రెండు రాష్ట్రాల‌నూ క‌లిపేయాల‌నే డిమాండ్లు వ‌చ్చినా.. మ‌ళ్లీ తెలంగాణ ఏపీ.. క‌లిసిపోయి.. ఉమ్మ‌డిరాష్ట్రం ఏర్ప‌డినా.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

“ఏపీ అబివృద్ధి చూసి ఓర్వ‌లేక తండ్రీ కొడుకులు..(కేసీఆర్‌-కేటీఆర్‌) వాగుతున్నారు. కేసీఆర్ పిట్ట‌క‌బుర్లు చెబుతున్నార‌ని.. అక్క‌డి వారేచెబుతున్నారు. ఇప్పుడు తండ్రి చాటు బిడ్డ‌గా.. కేటీఆర్ కూడా పిట్ట‌క‌బుర్లు చెబుతున్నారు. అస‌లు హైద‌రాబాద్ అబివృద్ధి చేసింది ఎవ‌రో ముందుకు  కేటీఆర్ తెలుసుకోవాలి. అసలు హైద‌రాబాద్‌కు ఒక సంస్కృతి, సంప్ర‌దాయాన్ని నేర్పింది ఎవ‌రో.. కేటీఆర్ తెలుసుకోవాలి“ అని జోగి కౌంట‌ర్ ఇచ్చారు.

హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఏపీ ప్ర‌జ‌లే సంస్కృతి నేర్పార‌ని, ఏపీపాలకులే.. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశార‌ని.. ఇప్పుడు ఆ బ్రాండ్‌ను తండ్రీ కొడుకులు ఎంజాయ్ చేస్తున్నార‌ని.. జోగి వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ గ్రామంలో చూసినా.. అభివృద్ధి క‌నిపిస్తుంద‌ని.. జోగి అన్నారు. కేటీఆర్ ఇలానే మాట్లాడితే.. తాము కూడా మాట్లాడ‌గ‌ల‌మ‌న్నారు. మొత్తానికి ఏపీ-తెలంగాణల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి.

This post was last modified on April 29, 2022 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago