ఏపీ ప్రభుత్వంతో చెలిమిగా ఉండే తెలంగాణ ప్రభుత్వం తాజాగా జూలు విదిల్చిందా? అనే రేంజ్లో కీలక మంత్రి, సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపరర్టీ షోలో పాల్గొన్నకేటీఆర్.. మాట్లాడుతూ.. ఏపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన సరిగా లేదని.. నేరుగా వ్యాఖ్యానించారు. “నా మిత్రుడు ఏపీలో ఉంటాడు. మొన్నామధ్య నా దగ్గరకు వచ్చాడు. అక్కడి పరిస్థితి వివరించారు“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“ఏపీలో రోడ్లు లేవు.. ఏపీలో తాగడానికి నీళ్లు లేవు. ఇక, సాగుకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక, రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. మీకు ఏమైనా అనుమానం ఉంటే.. ఒక్కసారి పొరుగు రాష్ట్రానికి కారులో వెళ్లిరండి పరిస్థితి మీకు తెలుస్తుంది!“ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీలో రహదారులపై అక్కడి ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సాగుకు కాదు.. తాగేందుకే అక్కడ నీళ్లు దొరకడం లేదు. రోడ్లు గుంతలు పడి.. ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ..నాకు ఇష్టం లేక చెప్పడం లేదు.. వాస్తవాలే చెబుతున్నారు.
పొరుగు రాష్ట్రాల కంటే.. మౌలిక సదుపాయాల కల్పనలోనూ.. విద్యుత్, నీరు, వసతులు, రహదారులు ఇలా ఎలా చూసుకున్నా దేశంలోనే హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్లో ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు. పెట్టుబడులు పెట్టేందుకు అత్యుతమ గమ్యస్థానం హైదరాబాదేనని చెప్పారు. ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదని.. 24/7 తాను అందుబాటులో ఉంటానని.. స్వయంగా ఏసమస్య వచ్చినా..తాను పరిశీలిస్తానని.. అన్నారు.
అంతేకాదు.. తన పిట్ట(ట్విట్టర్) ఎప్పుడూ పలుకుతూనే ఉంటుందని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే.. మొత్తంగా.. చూస్తే.. తన రాష్ట్రాన్ని బిజినెస్ చేసుకునేందుకు పొరుగు రాష్ట్రం ఏపీపై రాళ్లు వేయడం ఏంటనేది ఇప్పుడు చర్చగా మారింది. మరి దీనిపై ఏపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on April 29, 2022 2:40 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…