వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలపైనే చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టారు. తనను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి సోదరులు పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులోను, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్ళపల్లెలోను ఎంఎల్ఏలుగా గెలిచారు.
2019లో అధికారంలోకి రాగానే కుప్పంలో చంద్రబాబును దెబ్బకొట్టడమే ధ్యేయంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న పెద్దిరెడ్డి మొత్తం కుప్పంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. స్ధానిక సంస్ధలు, మున్సిపాలిటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ ఇందులో భాగమే. అప్పటినుండి పెద్దిరెడ్డి రాజకీయానికి విరుగుడుగా చంద్రబాబు కూడా పుంగనూరుపై దృష్టిపెట్టారు.
మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో గురువారం తంబళ్లపల్లెకు చెందిన కొందరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి సోదరులకు వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని స్పష్టం చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీయే గెలిచేట్లు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి కష్టపడాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడించేంత శక్తి ఎవరికుందనేదే కీలకమైన ప్రశ్న.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. కాబట్టి ఎవరిమీదో నమ్మకం ఉంచేకన్నా స్వయంగా చంద్రబాబే పుంగనూరులో రెగ్యులర్ గా పర్యటనలు పెట్టుకోవాల్సిందే. టీడీపీకి వచ్చే ఓట్లు చంద్రబాబును చూసేకానీ మాజీమంత్రిని చూసి కాదు. అందుకనే హైదరాబాద్ లోనో లేకపోతే మంగళగిరిలోనో కూర్చోకుండా చంద్రబాబు క్షేత్ర స్ధాయిలోకి వెళ్ళాల్సిందే.
నియోజకవర్గ నేతలపై భారం పెట్టేసి ఊరుకుంటె మొన్నటి కుప్పం నియోజకవర్గంలో ఫలితాలు వచ్చినట్లే వస్తాయి. ఎందుకంటే వీళ్ళెవరికీ ఎవరిపైనా పట్టులేదు. ఏదో పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు. కచ్చితంగా పెద్దిరెడ్డిని టార్గెట్ పెట్టుకుని ఓడించాలంటే నియోజకవర్గంలో తిరగకపోతే జరిగే పని కాదు. అమర్ కూడా ఎక్కువ రోజులు బెంగుళూరు వ్యాపారాలతోనే బిజీగా ఉంటారు. పెద్దిరెడ్డి మీద ఓడిపోయిన అమర్ మరదలు అనూషారెడ్డి కూడా బెంగుళూరులోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చుని పెద్దిరెడ్డి ఓడిపోవాలంటే జరిగే పని కాదు.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…