Political News

బాబు కోరిక తీరాలంటే టీడీపీ ప్లాన్ మార్చాలి

వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాలపైనే చంద్రబాబు నాయుడు ఎక్కువగా దృష్టి పెట్టారు. తనను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి సోదరులు పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులోను, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్ళపల్లెలోను ఎంఎల్ఏలుగా గెలిచారు.

2019లో అధికారంలోకి రాగానే కుప్పంలో చంద్రబాబును దెబ్బకొట్టడమే ధ్యేయంగా పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న పెద్దిరెడ్డి మొత్తం కుప్పంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. స్ధానిక సంస్ధలు, మున్సిపాలిటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ ఇందులో భాగమే. అప్పటినుండి పెద్దిరెడ్డి రాజకీయానికి విరుగుడుగా చంద్రబాబు కూడా పుంగనూరుపై దృష్టిపెట్టారు.

మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో గురువారం తంబళ్లపల్లెకు చెందిన కొందరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి సోదరులకు వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని స్పష్టం చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను టీడీపీయే గెలిచేట్లు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి కష్టపడాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడించేంత శక్తి ఎవరికుందనేదే కీలకమైన ప్రశ్న.

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి అంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. కాబట్టి ఎవరిమీదో నమ్మకం ఉంచేకన్నా స్వయంగా చంద్రబాబే పుంగనూరులో రెగ్యులర్ గా పర్యటనలు పెట్టుకోవాల్సిందే. టీడీపీకి వచ్చే ఓట్లు చంద్రబాబును చూసేకానీ మాజీమంత్రిని చూసి కాదు. అందుకనే హైదరాబాద్ లోనో లేకపోతే మంగళగిరిలోనో కూర్చోకుండా చంద్రబాబు క్షేత్ర స్ధాయిలోకి వెళ్ళాల్సిందే.

నియోజకవర్గ నేతలపై భారం పెట్టేసి ఊరుకుంటె మొన్నటి కుప్పం నియోజకవర్గంలో ఫలితాలు వచ్చినట్లే వస్తాయి. ఎందుకంటే వీళ్ళెవరికీ ఎవరిపైనా పట్టులేదు. ఏదో పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు. కచ్చితంగా పెద్దిరెడ్డిని టార్గెట్ పెట్టుకుని ఓడించాలంటే నియోజకవర్గంలో తిరగకపోతే జరిగే పని కాదు. అమర్ కూడా ఎక్కువ రోజులు బెంగుళూరు వ్యాపారాలతోనే బిజీగా ఉంటారు. పెద్దిరెడ్డి మీద ఓడిపోయిన అమర్ మరదలు అనూషారెడ్డి కూడా బెంగుళూరులోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చుని పెద్దిరెడ్డి ఓడిపోవాలంటే జరిగే పని కాదు. 

This post was last modified on April 29, 2022 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

3 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

4 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

5 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

5 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

7 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

7 hours ago