Political News

క్షేత్ర‌స్థాయిలో.. టీడీపీ వ్యూహాత్మ‌క పోరు

రాష్ట్రంలో మారుతున్న ప‌రిణామాల‌ను టీడీపీ నాయ‌కులు చాలా నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏవిధంగా అడుగులు వేయాలి..  వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎలా ఎక్కాలి?  వంటి కీల‌క అంశాల‌పై వారు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌ల‌తో ఒక నివేదిక‌ను చంద్ర‌బాబు తెప్పించుకున్నార‌ని తెలిసింది. గ‌డిచిన ఆరు మాసాలుగా జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంద‌నే విష‌యంపై దీనిలో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఎందుకంటే.. తొలి రెండున్న‌రేళ్ల కాలంలో జ‌గ‌న్ పాల‌న ఎలా ఉంద‌నేది నిర్దిష్టంగా చెప్పే ప‌రిస్థితి లేకుం డా పోయింది. ఎందుకంటే.. రెండు సంవ‌త్స‌రాలు క‌రోనాతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయింది.

దీంతో ఆ స‌మ‌యాన్ని వ‌దిలేసి.. ఇటీవ‌ల ఆరు మాసాల పాల‌నపై సామాన్యుల నుంచి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల వ‌ర‌కు ఏమ‌నుకుంటున్నార‌ని.. చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి ఓట్లే ఏ పార్టీకైనా కీల‌కంగా మార‌నున్నాయి. ఇలా అందిన రిపోర్టుల‌ను క్రోడీక‌రించి..వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ మేనిఫెస్టోను కూడా రూపొందించాల‌ని బాబు భావిస్తున్న‌ట్టు సీనియర్లు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. ప్ర‌జ‌లు చంద్ర‌బాబు వైపు మొగ్గు చూపుతు న్నారని తెలిసింది.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మాట వాస్త‌వం. ఒక్క‌ఛాన్స్‌తో త‌న జీవితాలు మారుతాయ‌ని అంద‌రూ భావించారు. అయితే.. ఈ ఒక్క ఛాన్సే త‌మ‌కు ఏమీ లేకుండా చేసింద‌నే బావన ప్ర‌జ‌ల్లో ఉంద‌ని.. టీడీపీ పార్ల‌మెంట‌రీ జిల్లాల అధ్య‌క్షులు నివేదిక‌లో స్ప‌ష్టం చేశారని సీనియ‌ర్లు చెబుతున్నారు. “మేనిఫెస్టోలో చెప్పిన‌వి  చేస్తున్నామ‌ని అంటున్నారు. కానీ, మాకు ఇచ్చిన హామీల‌ను మేనిఫెస్టోలో ఎందుకు పెట్ట‌లేదు.“. అని  వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు నిల‌దీశారు. ఇక‌, ఉద్యోగుల సీపీఎస్‌.. బ్ర‌హ్మ‌ప‌దార్ధంగా మారిపోయింది. మెగా డీఎస్సీ.. మెగా డ్రీమ్‌గా నిలిచిపోయింది. ఇలా.. అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు  టీడీపీ బాధ్యుల ముందు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.  

అంతేకాదు… “అన్నీ చేస్తున్నాం.. అంటున్నారు .కానీ.. ప్ర‌బుత్వం చేస్తున్న సంక్షేమం కేవ‌లంస‌మాజంలోని 10 శాతం మందికి కూడా చేర‌డం లేదు. మ‌రి మిగిలిన 90 శాతం మంది ప్ర‌జ‌ల‌(వీరిలో దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి,) ప‌రిస్థితి ఏంటి?“ అని కొంద‌రు ప్ర‌శ్నించిన విష‌యాన్ని కూడా నివేదిక‌లో పేర్కొన్నారు. అంటే మొత్తంగా .. టీడీపీకి అనుకూల ప‌రిణామాలు ఏర్ప‌డుతున్నాయ‌ని.. వైసీపీ వ్య‌తిరేక‌త‌ను టీడీపీకి అనుకూలంగా మార్చుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on April 29, 2022 9:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago