కాకతాళీయమో ఏమోగానీ తెలుగు ముఖ్యమంత్రులిద్దరు చెప్పింది ఒకేమాట. ఒకేరోజున తెలంగాణలో కేసీయార్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా తమ నేతలకు చేసిన దిశానిర్దేశం ఒకేలాగుంది. కేసీయార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా ఏకతాటిపై నిలబడి ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు.
విజయవాడలో జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లు, ఎంఎల్ఏలు ఒక్క టీంగా పని చేస్తే కానీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్నారు. వ్యక్తుల కన్నా తనకు పార్టీయే ముఖ్యమని స్పష్టంగా చెప్పారు. పార్టీ బాగుంటేనే మనమంతా బాగుంటామన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. మొత్తం మీద కేసీయార్ అయినా జగన్ అయినా చెప్పిందేమంటే నేతల మధ్య విబేధాలు మరచిపోయి పార్టీ గెలుపు కోసం కష్టపడాలని.
పార్టీ గురించి జనాల అభిప్రాయం విషయంలో తాను సర్వే చేయిస్తున్నట్లు కేసీయార్ ప్రకటించారు. ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ రెగ్యులర్ గా తాను ప్రభుత్వం, మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లోని సంతృప్తస్ధాయిపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. చేయిస్తున్న సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందని ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయమై ఎలాంటి అనుమానాలు లేవని ఇద్దరు చెప్పటం గమనార్హం.
ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ అధికారంలోకి రావటంలో ఎలాంటి అనుమానం లేదని కాకపోతే ఇప్పుడునన్ని సీట్లు మళ్ళీ వచ్చి తీరాలన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడేళ్ళల్లోనే సంక్షేమ పథకాలకు రు. 1.37 లక్షల కోట్లు వ్యయం చేసిన తర్వాత 175కి 175 సీట్లూ వచ్చి తీరాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీని గెలిపించాలని జనాలు అనుకుంటున్నట్లు జగన్ తెలిపారు. కుప్పంలోనే వైసీపీ గెలిచేట్లుంటే 175 సీట్లూ ఎందుకు గెలవకూడదని ప్రశ్నించారు. మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులు తమ నేతలకు ఒకేరకమైన దిశానిర్దేశం చేయటం విచిత్రంగానే ఉంది.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…