విద్య మరియు వైద్య రంగాలకు ఊతం ఇవ్వడం ఇవాళ అత్యావశ్యకం. మునుపటి కన్నా వేగంగా నిర్ణయాల అమలు కేసీఆర్ ముందున్న ఏకైక సవాలు. పరిణామాలు మారుతున్నందున తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కేసీఆర్ చేయాల్సిన కృషి ఎంతో ! తెలంగాణలో నిన్నటి వేళ మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు ఆరంభం అయ్యాయి. టిమ్స్ పేరిట భాగ్యనగరిలో ఉప్పల్, అల్వాల్, ఎర్రగడ్డలో ఇవి శంకుస్థాపనకు నోచుకున్నాయి. ఓ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదలకు అత్యాధునిక వైద్యం అందించడమే ధ్యేయంగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పై మంచి స్పందనే వస్తోంది.
స్థలం ఎంపిక దగ్గర నుంచి ఆస్పత్రులు డిజైనింగ్ వరకూ అన్నింటినీ కేసీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. గతంలో కన్నా ఇప్పుడు వైద్య రంగ పరంగా తాము అభివృద్ధి సాధించామని కేసీఆర్ చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ కూడా అదే మాట అంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల కన్నా తామే ఎంతో బాగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం అని, ఈ క్రమంలో ప్రాధాన్య రంగాలకు నిధుల కేటాయింపు విస్మరించడం లేదు అని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇక వైద్య రంగంలో గతం కన్నా మెరుగైన వసతులు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో తెచ్చేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆస్పత్రులకు ఆయన శ్రీకారం దిద్దారు.
ఇదే వార్త ఆంధ్రాలోనూ హల్చల్ చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా ఊపిరి పోసుకోలేదు కనుక ! ఉన్న వాటిని అభివృద్ధి చేస్తూనే కొత్త వాటి కోసం కేసీఆర్ ఆరాట పడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా వైద్య రంగానికి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న చేయూత అన్నది కొనసాగితే ప్రభుత్వ పరంగా పేదలకు అందే సేవల్లో మెరుగుదల రావడం ఖాయం. ఆ విధంగా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఇవి ఎదిగితే సర్కారు దవఖానాలకు మళ్లీ మళ్లీ పేదలు రావడం, ఇక్కడి సేవలకు ముగ్ధులవడం ఖాయం.
రాష్ట్రం ఏర్పడిన నాడు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇవాళ తెలంగాణ లో 17 మెడికల్ కాలేజీలకు చేరుకుంది. రానున్న రెండేళ్లలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. నర్సింగ్ కాలేజీలు 6 మాత్రమే రాష్ట్రం ఏర్పడిననాడు ఉండేవి. ఏ నర్సింగ్ కాలేజీలకు వెళ్లినా కేరళ స్ఠాఫ్ నర్సులు ఉండే వారు. కాని కాలేజీలు పెట్టలేదు. జిల్లాకో నర్సింగ్ కాలేజీలు పెట్టాలని, 33 జిల్లా కాలేజీలు పెట్టాలని నిర్ణయించారు. గద్వాల, బాన్సువాడ లో ఇప్పటికే ప్రారంభమైంది…అని చెబుతున్నారాయన.
This post was last modified on April 28, 2022 7:32 am
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…