Political News

పెట్రోల్ ధ‌ర‌లు మీ ఇష్ట‌మేనా?: ప్ర‌ధాని ప్ర‌శ్న‌

తాజాగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర్చువ‌ల్‌గా భేటీ అయ్యారు. అయితే.. దీనికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కాలేదు. ఆయ‌న టీఆర్ ఎస్ ప్లీన‌రీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లకు ప్ర‌ధాని మోడీ గ‌ట్టి ప్ర‌శ్న సంధించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పెట్రో ధరల అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని. సామాన్యులకు ఊరట కలిగించేలా గతేడాది నవంబర్లో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై రూ.10 చొప్పున‌ ఎక్సైజ్ సుంకం తగ్గించిందని గుర్తుచేశారు.

రాష్ట్రాలూ అదే తరహాలో పన్నులు తగ్గించాలని అప్ప‌ట్లోనే తాము కోరినట్లు ప్ర‌ధాని గుర్తు చేశారు. అయితే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆ పని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “నేను ఎవరినీ విమర్శించడం లేదు“ అంటూనే చుర‌క‌లు అంటించారు. ఏపీ తెలంగాణ‌ల్లో పెట్రోల్ ధ‌ర‌లు మీ ఇష్ట‌మేనా? అని న‌వ్వుతూ ప్ర‌శ్నించారు. అంతేకాదు…. మహారాష్ట్ర, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు ధ‌ర‌లు త‌గ్గించ‌లేద‌న్నారు..

ఇక‌పై అయినా… ప్ర‌జ‌ల కోసం.. ఆయా ప్ర‌భుత్వాలు వ్యాట్ తగ్గించి, సామాన్యులకు లబ్ధి చేకూర్చాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు మోడీ. అయితే.. ఈ విష‌యం అప్ర‌స్తుత‌మ‌ని.. బెంగాల్ సీఎం మ‌మ‌త అక్క‌డే ప్ర‌శ్నించారు. “ఈజ్ దిస్ రైట్ డ‌యాస్ టు డిస్క‌స్ ఎబౌట్ హైక్‌“ అని ఆమె ప్ర‌శ్నించారు. దీంతో ప్ర‌ధాని స‌ర్దుకున్నారు. ఇక‌, దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చ‌ర్చించారు.

ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. కేసుల పెరుగుదలతో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం స్పష్టమైందన్నారు మోడీ. ఇతర దేశాలతో పోలిస్తే కరోనాను దేశంలో మెరుగ్గా అదుపు చేయగలిగామని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మనం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దేశంలో దాదాపు 96శాతం మంది వయోజనులు వ్యాక్సిన్ వేసుకున్నారని, ఇది గర్వించదగ్గ విషయం అన్నారు. ఇక‌, ఏపీలో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన‌న్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మెచ్చుకున్నారు. 

This post was last modified on April 27, 2022 8:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

4 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

28 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago