కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు అత్యధిక నష్టం
చవిచూస్తున్న దేశం అమెరికా. వారం కిందటి వరకు ఇటలీ కన్నీటి గాథల గురించి
చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అమెరికా దాన్ని దాటేసింది. ఊహించని
స్థాయిలో అక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా భయం
గొలిపేలా ఉంది.
ఆ దేశంలో గంటకు 107 మంది చనిపోతున్నారంటే పరిస్థితి
అంచనా వేయొచ్చు. ఒక్క రోజు వ్యవధిలో ఆ దేశంలో 2569 మంది కరోనా కారణంగా
ప్రాణాలు వదిలారు. వారం కిందటి వరకు ఏదైనా దేశంలో రోజుకు వెయ్యమంది చనిపోతే
వామ్మో అంటూ మాట్లాడాం. కానీ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో 2569 మంది
చనిపోవడమంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఒక్క దేశంలో కరోనా
మరణాలు 33 వేలకు చేరుకోవడం గమనార్హం.
ఐతే అమెరికాలో ఇంతటి దారుణమైన
పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అని
స్పష్టమవుతోంది. ఆయన నిర్లక్ష్య ధోరణి వల్లే దేశం అతలాకుతలం అయ్యే
పరిస్థితి తలెత్తిందన్నది స్పష్టం. అమెరికాలో కరోనా పేట్రేగి పోనుందని..
పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని.. ఫిబ్రవరి 25నే అమెరికా నేషనల్ సెంటర్
ఫర్ మెడికల్ ఇంటలిజెన్స్ విభాగం ట్రంప్ను హెచ్చరించిందట.
కానీ ఆయన
వాళ్ల సమాచారాన్ని లైట్ తీసుకున్నారు. కరోనా గురించి ఎవరూ భయపడాల్సిన పని
లేదని ప్రకటన చేశారు. అప్పటికే షెడ్యూల్ అయిన భారత పర్యటన కోసం బయల్దేరి
వచ్చేశారు. తిరిగి స్వదేశానికి వెళ్లాక కూడా ట్రంప్ కరోనా కట్టడి గురించి
ఆలోచించలేదు. ఆ దేశంలో కరోనా కేసులు బయటపడ్డాక కూడా లాక్ డౌన్ లాంటి
చర్యలేమీ చేపట్టలేదు.
జనాల నిర్లక్ష్యం కూడా తోడై ఇప్పుడు కరోనా
అక్కడ విలయ తాండవం చేస్తోంది. మన దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి
వాళ్లు కూడా కరోనా గురించి తేలిగ్గా మాట్లాడి.. వారం తిరక్కుండానే తీవ్రతను
అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ ట్రంప్ మూర్ఖత్వంతో
నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టారన్నది
స్పష్టం.
This post was last modified on April 18, 2020 8:01 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…