Political News

తెలంగాణకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు

భారత్ లో మహమ్మారి వైరస్ కేసులు నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. గత వారం రోజుల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. ఈ ప్రాణాంతక వైరస్ పంజా విసురుతున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో గత 10 రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం శోచనీయం. కేసుల తీవ్రతను బట్టి తెలంగాణలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశ ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ అభిప్రాయాలను ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై తాజా సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఆ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ (143%) తొలి స్థానంలో ఉండగా తెలంగాణ(122%) రెండో స్థానంలో ఉంది. ఇక, మరో తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆ జాబితాలో చివరి స్థానాల్లో ఒకటి దక్కించుకుంది.

కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ లోని గణాంకాల ఆధారంగా ఇండియా ఇన్ పిక్సెల్స్అనే సంస్థ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యకు, క్వారంటైన్ లో ఉన్న వారి సంఖ్యల నిష్పత్తి ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించింది. తెలంగాణకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉందని…అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అంతకుముందే, తెలంగాణలో రోజువారి కరోనా టెస్టుల సంఖ్య ఎంతో వెల్లడించాలని….కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని..డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టెస్టుల సంఖ్య 4వేలకు పెరిగినా….ఆ సంఖ్య మరింత పెరగాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెస్టుల సంఖ్య పెంచకుంటే…కేసుల సంఖ్యలో ఢిల్లీ, మహారాష్ట్రలను తెలంగాణ అధిగమిస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఈ ముప్పు కేవలం 8 శాతం ఉండడం ఊరటనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలు బాగున్నాయని, ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారని జాతీయ స్థాయి వైద్య, ఆరోగ్య నిపుణులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

వివిధ రాష్ట్రాలకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు శాతం

ఢిల్లీ (143%)
తెలంగాణ(122%)
మహారాష్ట్ర (65%)
గుజరాత్ (45%)
తమిళనాడు (38%)
ఉత్తరప్రదేశ్(18%)
కర్ణాటక (8%)
ఆంధ్రప్రదేశ్( 8%)
కేరళ (0.7%)

This post was last modified on June 22, 2020 8:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

5 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

5 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

6 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

6 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago