భారత్ లో మహమ్మారి వైరస్ కేసులు నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతుండడం కలవరపెడుతోంది. గత వారం రోజుల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. ఈ ప్రాణాంతక వైరస్ పంజా విసురుతున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో గత 10 రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం శోచనీయం. కేసుల తీవ్రతను బట్టి తెలంగాణలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశ ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ అభిప్రాయాలను ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై తాజా సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. ఆ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ (143%) తొలి స్థానంలో ఉండగా తెలంగాణ(122%) రెండో స్థానంలో ఉంది. ఇక, మరో తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆ జాబితాలో చివరి స్థానాల్లో ఒకటి దక్కించుకుంది.
కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ లోని గణాంకాల ఆధారంగా ఇండియా ఇన్ పిక్సెల్స్
అనే సంస్థ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యకు, క్వారంటైన్ లో ఉన్న వారి సంఖ్యల నిష్పత్తి ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించింది. తెలంగాణకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు పొంచి ఉందని…అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అంతకుముందే, తెలంగాణలో రోజువారి కరోనా టెస్టుల సంఖ్య ఎంతో వెల్లడించాలని….కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని..డిమాండ్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టెస్టుల సంఖ్య 4వేలకు పెరిగినా….ఆ సంఖ్య మరింత పెరగాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెస్టుల సంఖ్య పెంచకుంటే…కేసుల సంఖ్యలో ఢిల్లీ, మహారాష్ట్రలను తెలంగాణ అధిగమిస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఈ ముప్పు కేవలం 8 శాతం ఉండడం ఊరటనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యలు బాగున్నాయని, ఏపీలో అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారని జాతీయ స్థాయి వైద్య, ఆరోగ్య నిపుణులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
వివిధ రాష్ట్రాలకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ముప్పు శాతం
ఢిల్లీ (143%)
తెలంగాణ(122%)
మహారాష్ట్ర (65%)
గుజరాత్ (45%)
తమిళనాడు (38%)
ఉత్తరప్రదేశ్(18%)
కర్ణాటక (8%)
ఆంధ్రప్రదేశ్( 8%)
కేరళ (0.7%)
This post was last modified on June 22, 2020 8:20 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…