Political News

వైసీపీ నేత‌ల‌తో ల‌గ‌డ‌పాటి మంత‌నాలు.. ఏం జరుగుతోంది?

మాజీ ఎంపీ, ఎన్నిక‌ల ఫ‌లితాల విశ్లేష‌కుడుగా వ్య‌వ‌హ‌రించిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌న ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో వ‌రుస‌గా రెండు రోజుల పాటు వైసీపీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.  మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశ‌మయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు.

అనంతరం నందిగామలోని స్థానిక మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ పాలేటి సతీష్‌ ఇంట్లో లగడపాటి బస చేశారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం లగడపాటి, వసంత కృష్ణ ప్రసాద్‌ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య వైసీపీ వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఎంపీ స్థానం వైసీపీలో ఖాళీగా ఉంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీచేసిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. పీవీపీ.. త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక్క‌సారి కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌లేదు. అయితే.. సీఎం జ‌గ‌న్‌కు మాత్రం ఆయ‌న ట‌చ్‌లో ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి రావ‌డం ఆస‌క్తిగా మారింది. రేపు ల‌గ‌డ‌పాటి క‌నుక వైసీపీలోక వ‌స్తే.. విజ‌య‌వాడ ఎంపీ స్థానాన్ని ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశం మెండుగా ఉందని వైసీపీ నేత‌లు కూడా అంటున్నారు. ఇక‌, ల‌గ‌డ‌పాటి త‌న ప‌ర్య‌ట‌న‌లో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు  కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత‌ మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు.

కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నేత‌ గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే.. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టరు కొమ్మినేని రవిశంకర్, కాలువ పెదబాబు, నందిగామ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కానీ, ల‌గ‌డ‌పాటి స‌మ‌యం చూసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంద‌నే వార్త‌లు  మాత్రం  హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

This post was last modified on April 25, 2022 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జమీల్ సాబ్ భయపడుతున్నారా?

గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…

1 hour ago

బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పు.. ఖాతాదారుడికి వాతలు?

గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…

2 hours ago

ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…

2 hours ago

తెలివిగా ప్లాన్ చేసుకుంటున్న జన నాయకుడు

జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…

5 hours ago

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…

5 hours ago

దురంధర్ 2 డౌన్ అవ్వడానికి కారణాలేంటి

హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…

6 hours ago