Political News

వైసీపీ నేత‌ల‌తో ల‌గ‌డ‌పాటి మంత‌నాలు.. ఏం జరుగుతోంది?

మాజీ ఎంపీ, ఎన్నిక‌ల ఫ‌లితాల విశ్లేష‌కుడుగా వ్య‌వ‌హ‌రించిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌న ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో వ‌రుస‌గా రెండు రోజుల పాటు వైసీపీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.  మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశ‌మయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు.

అనంతరం నందిగామలోని స్థానిక మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ పాలేటి సతీష్‌ ఇంట్లో లగడపాటి బస చేశారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం లగడపాటి, వసంత కృష్ణ ప్రసాద్‌ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య వైసీపీ వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఎంపీ స్థానం వైసీపీలో ఖాళీగా ఉంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీచేసిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. పీవీపీ.. త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక్క‌సారి కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌లేదు. అయితే.. సీఎం జ‌గ‌న్‌కు మాత్రం ఆయ‌న ట‌చ్‌లో ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి రావ‌డం ఆస‌క్తిగా మారింది. రేపు ల‌గ‌డ‌పాటి క‌నుక వైసీపీలోక వ‌స్తే.. విజ‌య‌వాడ ఎంపీ స్థానాన్ని ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశం మెండుగా ఉందని వైసీపీ నేత‌లు కూడా అంటున్నారు. ఇక‌, ల‌గ‌డ‌పాటి త‌న ప‌ర్య‌ట‌న‌లో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు  కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత‌ మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు.

కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నేత‌ గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే.. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టరు కొమ్మినేని రవిశంకర్, కాలువ పెదబాబు, నందిగామ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కానీ, ల‌గ‌డ‌పాటి స‌మ‌యం చూసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంద‌నే వార్త‌లు  మాత్రం  హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

This post was last modified on April 25, 2022 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…

33 minutes ago

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

8 hours ago

జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…

8 hours ago

వైసీపీకి భారీ దెబ్బ‌.. ‘గుంటూరు’ పాయే!

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 2021లో అతి…

10 hours ago

కిరణ్ అబ్బవరం… తెలివే తెలివి

కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…

10 hours ago

తోలు తీస్తా: సోష‌ల్ మీడియాకు రేవంత్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోంద‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విష‌యంలో…

11 hours ago