Political News

వైసీపీ నేత‌ల‌తో ల‌గ‌డ‌పాటి మంత‌నాలు.. ఏం జరుగుతోంది?

మాజీ ఎంపీ, ఎన్నిక‌ల ఫ‌లితాల విశ్లేష‌కుడుగా వ్య‌వ‌హ‌రించిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌న ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో వ‌రుస‌గా రెండు రోజుల పాటు వైసీపీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.  మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశ‌మయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు.

అనంతరం నందిగామలోని స్థానిక మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ పాలేటి సతీష్‌ ఇంట్లో లగడపాటి బస చేశారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం లగడపాటి, వసంత కృష్ణ ప్రసాద్‌ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య వైసీపీ వ్య‌వ‌హారాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఎంపీ స్థానం వైసీపీలో ఖాళీగా ఉంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీచేసిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. పీవీపీ.. త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఒక్క‌సారి కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అడుగు పెట్ట‌లేదు. అయితే.. సీఎం జ‌గ‌న్‌కు మాత్రం ఆయ‌న ట‌చ్‌లో ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి రావ‌డం ఆస‌క్తిగా మారింది. రేపు ల‌గ‌డ‌పాటి క‌నుక వైసీపీలోక వ‌స్తే.. విజ‌య‌వాడ ఎంపీ స్థానాన్ని ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశం మెండుగా ఉందని వైసీపీ నేత‌లు కూడా అంటున్నారు. ఇక‌, ల‌గ‌డ‌పాటి త‌న ప‌ర్య‌ట‌న‌లో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు  కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత‌ మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు.

కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నేత‌ గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే.. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టరు కొమ్మినేని రవిశంకర్, కాలువ పెదబాబు, నందిగామ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కానీ, ల‌గ‌డ‌పాటి స‌మ‌యం చూసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంద‌నే వార్త‌లు  మాత్రం  హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

This post was last modified on April 25, 2022 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

40 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago