మాజీ ఎంపీ, ఎన్నికల ఫలితాల విశ్లేషకుడుగా వ్యవహరించిన లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల పాటు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్కు లగడపాటి, వసంత హాజరయ్యారు.
అనంతరం నందిగామలోని స్థానిక మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో లగడపాటి బస చేశారు. మరుసటి రోజు ఉదయం లగడపాటి, వసంత కృష్ణ ప్రసాద్ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వైసీపీ వ్యవహారాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం విజయవాడ ఎంపీ స్థానం వైసీపీలో ఖాళీగా ఉంది. గత 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేసిన ప్రముఖ వ్యాపార వేత్త.. పీవీపీ.. తర్వాత.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. అయితే.. సీఎం జగన్కు మాత్రం ఆయన టచ్లో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో లగడపాటి వైసీపీ నేతలతో టచ్లోకి రావడం ఆసక్తిగా మారింది. రేపు లగడపాటి కనుక వైసీపీలోక వస్తే.. విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆయనకు కేటాయించే అవకాశం మెండుగా ఉందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. ఇక, లగడపాటి తన పర్యటనలో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు.
కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన వైసీపీ నేత గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే.. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టరు కొమ్మినేని రవిశంకర్, కాలువ పెదబాబు, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. కానీ, లగడపాటి సమయం చూసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉందనే వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.
This post was last modified on April 25, 2022 11:09 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…