తెలంగాణ రాజకీయాల్లోకి ఎన్నికల వ్యూహకర్తగా ఎంట్రీ ఇవ్వడంతో మొదలు ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగిస్తున్న అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆ ఒరవడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరేందుకు సోనియా, రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వచ్చిన టైంలోనే ఆయన టీఆర్ఎస్ అధినేతతో భేటీ అవడం రెండు పార్టీలకు పెద్ద షాకింగ్ న్యూస్ అనే సంగతి తెలిసిందే.
అయితే, తాను కాంగ్రెస్లో చేరినా తన టీం (ఐప్యాక్) టీఆర్ఎస్కు పనిచేస్తుందని పీకే చెప్పినట్టుగా ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ సమయంలోనే పెద్ద ట్విస్టు ఉందని అంటున్నారు. పీకే తన సేవలు అందించడంలో భాగంగా సీఎం కేసీఆర్కు కీలక ప్రతిపాదన చేశారని అంటున్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని తాజా రిపోర్టులోనూ పీకే తేల్చి చెప్పినట్టు సమాచారం.
వారి స్థానంలో అక్కడ ఎవరు క్యాండిడేట్ అయితే బెటర్ అనే కోణంలోనూ సర్వే చేసి ఆ రిపోర్టు కూడా కేసీఆర్కు ఇచ్చినట్టు సమాచారం. పీకే ప్రతిపాదించిన ఆల్టర్నేట్ క్యాండిడేట్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ల పేర్లు సైతం ఉన్నాయనే ప్రచారం రెండు పార్టీల నేతల్లో గందరగోళం సృష్టిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైందని చెప్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించాలని తెలగాణ సీఎం కేసీఆర్ కంకణబద్దులై ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాదాస్పదులైనా , తిరిగి గెలుపొందలేరనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పీకే చేసిన సూచనతో కాంగ్రెస్ నేతలకు వెల్కం చెప్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన కొందరు సిటింగ్ ఎమ్మెల్యేల్లో మొదలైందని అంటున్నారు.
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…