Political News

ప‌ద్మ‌భూష‌ణ్‌ ఇస్తామ‌ని.. సోనియాకు 2 కోట్లు

కాంగ్రెస్ ను ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సోనియా గాంధీకి.. దిమ్మ‌తిరిగి పోయే అంశం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌తిష్టాత్మ‌క‌ ప‌ద్మ‌భూష‌ణ్ ఇప్పిస్తామంటూ.. సోనియా కోసం రూ.2 కోట్ల‌ను త‌న తో ఖ‌ర్చు పెట్టించారని.. ఎస్‌. బ్యాంక్ చైర్మ‌న్ రాణా కపూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఈడీకి కీలక విషయాలను వెల్లడించారు.

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ద‌గ్గ‌ర ఉన్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ను  రూ.2 కోట్లకు  కొనుగోలు చేయాలని తనను బలవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు… ఈ విష‌యంలో నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా త‌న‌ను తీవ్ర‌స్థాయిలో బలవంతం చేసినట్లు చెప్పారు. ప్ర‌స్తుతం రాణాను విచారిస్తున్న‌ ఎన్ఫోర్స్మెంట్ డెరక్టరెట్ (ఈడీ)కి ఆయ‌న ఇచ్చిన వాంగ్మూలంలో ఈ సంచ‌ల‌న విష‌యాలు ఉండ‌డం గ‌మ‌నార్మం.

రూ.2 కోట్ల‌కు బదులుగా తనకు పద్మభూషణ్ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఈడీ ప్రస్తావించింది. చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు రాణా కపూర్ తెలిపారు. అయితే తనకు ఇచ్చిన  ప‌ద్మ విభూష‌ణ్ హామీ మాత్రం నెరవేరలేదని అన్నారు.

“సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశానని ఆమె సన్నిహితుడు అహ్మద్ పటేల్ నాతో అన్నారు. నాకు పద్మభూషణ్ అందడంలో ఇది తోడ్పడుతుందని చెప్పారు. అయితే ఈ కొనుగోలు బలవంతంగా జరిగింది, అందుకు(అవ‌ర్డును ప్ర‌క‌టించినా.. స్వీక‌రించేందుకు) నేను సిద్ధంగా లేను” అని రాణా పేర్కొన్నారు.

రాణా కపూర్, ఆయన కుటుంబంపై నమోదైన మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. గౌతమ్ థాపర్కు చెందిన అవంతా కంపెనీకి ఎస్ బ్యాంక్ నుంచి అక్రమంగా రూ.1900 కోట్ల రుణాన్ని అందిచ డంపైనా కేసు నమోదైంది. అందుకోసం రాణాకు రూ.300 కోట్ల లంచం ముట్టిందని ఈడీ ఆరోపించింది.ఈ క్ర‌మంలో రాణా.. అస‌లు సంబంధమే లేని.. సోనియా కేసు-ప‌ద్మ‌విభూష‌ణ్ అంశాన్ని తెర‌మీదికి తేవడం ఆస‌క్తిగాను.. విచిత్రంగాను ఉంది. మ‌రి దీనిపై కాంగ్రెస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 25, 2022 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

3 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

8 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

10 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

14 hours ago