ఉత్తరప్రదేశ్లో సంచలనం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ బాలబాలికల సంరక్షణ గృహంలో కరోనా పరీక్షలు చేయగా.. అందులో 57 మందికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ 57 మందిలో ఏడుగురు గర్భవతులని తేలడం సంచలనం రేపుతోంది. అంతే కాదు.. ఒక అమ్మాయికి హెచ్ఐవీ ఉన్నట్లు కూడా వెల్లడైంది. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం దీనిపై దృష్టిసారించి విచారణ జరపాలని ఆదేశించే వరకు పరిస్థితి వెళ్లింది. కాన్పూర్ జిల్లాలోని ఈ స్టేట్ హోంలో ఒక అమ్మాయికి జ్వరంతో పాటు కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లింది. తర్వాత ఆమెను కరోనా పరీక్షలకు పంపారు. ఆ అమ్మాయికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో స్టేట్ హోంలో అందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఏకంగా 57 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరిలో చాలామందికి కరోనా లక్షణాలే కనిపించలేదు. స్టేట్ హోం సిబ్బందిలో కూడా ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఐతే కరోనా పరీక్షలు నిర్వహించే క్రమంలో అనుమానాలు తలెత్తి కొందరు అమ్మాయిలను పరీక్షించగా ఏడుగురు గర్భంతో ఉన్నట్లు తేలింది. ఒక అమ్మాయికి హెచ్ఐవీ కూడా ఉన్నట్లు తేలడం విస్మయానికి గురి చేసింది. ఈ విషయాన్ని కాన్పూర్ జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవరాయ్ తివారి కూడా ధ్రువీకరించారు.
ఐతే స్టేట్ హోంకు రావడానికి ముందే ఈ అమ్మాయిలు గర్భవతులైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ‘‘సంరక్షణ గృహంలో 57 మంది బాలికలను కరోనావైరస్ పాజిటివ్ కేసులుగా గుర్తించాం. ఏడుగురు బాలికలు గర్భంతో ఉన్నట్లు తేలింది. వారిలో ఐదుగురు కరోనా వైరస్తో ఉన్నారు. వీరు ఆగ్రా, ఎటా, కన్నోజ్, ఫిరోజాబాద్, కాన్పూర్ నగర్ బాలల సంక్షేమ కమిటీ సిఫార్సుపై ఇక్కడికి వచ్చారు. ఆ బాలికలంతా ఇక్కడికి రాకముందే గర్భవతులు. దీని గురించి పూర్తి సమాచారం జిల్లా అధికారుల దగ్గర ఉంది’’ అని అన్నారు.
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…
రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ…
ఇవాళ ఎక్కడ చూసినా ది ఒడిస్సి తాలూకు ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఈ సినిమా ట్వీట్లతో…
కొత్త శుక్రవారం వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర బోలెడు సినిమాలు కనిపిస్తున్నాయి కానీ వెంటనే వెళ్ళిపోదామనిపించేలా ఏదీ లేకపోవడం బయ్యర్ వర్గాలను…
సినిమా పిచ్చిలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఇది వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్…
తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా…