Political News

పీకేతో క‌లిసే పయనం.. కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌నాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కావాల్సిన వ్యూహాలను అందజేశారు. పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయం అవ‌డ‌మే ఓ ట్విస్టు అనుకుంటే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చి, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అవ‌డమే కాకుండా శ‌నివారం రాత్రి ప్రగతి భవన్ లోనే విడిది చేశారు.

దీంతో తెలంగాణ‌లో పీకే – కేసీఆర్ దోస్తీ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ ఈ విష‌యంలో ఓ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు సర్వం సిద్దం చేసుకున్న ప్రశాంత్ కిషోర్ హైద‌రాబాద్ టూర్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాశంగా మారింది.

వ్యూహకర్తగా కంటే కార్యకర్తగానే కాంగ్రెస్ కు పీకే సేవలు అందించబోతున్నట్లు ఏఐసీసీ వర్గాలు వ్యాఖ్యానాలు చేయడం, దేశానికే బ్రాండ్ లా మారిన పీకే కాంగ్రెస్ లోకి రావాలనుకోవడం శుభపరిణామమని సోనియా విధేయుడైన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ అనడం తదితర పరిణామాలు పీకే ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. కానీ ప్రశాంత్ కిషోర్ సైలెంటుగా కేసీఆర్‌తో స‌మావేశం అయ్యారు. దీనిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌యుడు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను స్థాపించిన ఐ-ప్యాక్ సంస్థ‌తో పీకే సంబంధాలు తెంపుకొన్నార‌ని పేర్కొంటూ… త‌మ‌కు ప్ర‌శాంత్ కిషోర్ కాకుండా ఆయ‌న సంస్థ సేవ‌లు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు.

కాగా, కాంగ్రెస్ లో చేరిక ప్రయత్నాలు ఆరంభించడం కంటే ముందే తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేయాలని పీకే నిర్ణయించుకున్న క్రమంలో.. ఒప్పందాల మేరకు తాను టీఆర్ఎస్ తోనే కలిసి పని చేస్తానని పీకే స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, త‌ను నేరుగా కాకుండా త‌న సంస్థ‌తో సేవ‌లు అందించేలా గులాబీ పార్టీ వ‌ర్గాల‌ను ఒప్పించిన‌ట్లు స‌మాచారం. కాగా, అటు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరికకు ప్రయత్నిస్తూ, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యర్థి టీఆర్ఎస్ కు స్ట్రాటజిస్టుగా పీకే కొనసాగడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. మ‌రోవైపు రాజ‌కీయ వ‌ర్గాలు షాక్ అవుతున్నాయి.

Satya

Recent Posts

ఆలస్యం చేస్తే అమృతం విషమే

పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…

3 hours ago

వైసీపీకి వచ్చేది తక్కువ… పోయేది ఎక్కువ!

వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు ప‌డిపోయింది. దీనికి కార‌ణాలు ఏంటన్న‌వి అంద‌రికీ తెలిసినా..…

4 hours ago

మూడో పొలిమేర… ఇంకా పెద్దగా?

కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్‌ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…

4 hours ago

బుల్లెట్ రైలుకు `రాజకీయ` రెడ్ సిగ్న‌ల్‌?!

తెలంగాణకు కీల‌క ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీల‌కంగా మార‌నుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్ల‌ను కేంద్ర…

5 hours ago

గ్రీన్ డ్రెస్ లో రాశీ గ్లామర్ మెరుపులు

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…

9 hours ago

ట్రోజన్ హార్స్… జక్కన్న చేతిలో పడుంటే?

క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…

12 hours ago