Political News

మంత్రుల జగన్ భజన.. మొద‌టికే మోసం?

ఏ పార్టీలో అయినా.. నేత‌ల‌కు.. అధిష్టానం మ‌ధ్య స‌ఖ్య‌త అవ‌స‌ర‌మే. అయితే. ఆ స‌ఖ్య‌త ఎంత వ‌ర‌కు ఉండాలి? అనేది కీల‌కం. ఒక నాయ‌కుడుగా.. ఉండ‌డం వేరు. అప్పుడు.. పార్టీ బాధ్య‌త ఒక్క‌టే ఉంటుంది. ఈ క్ర‌మంలో అధినాయ‌క‌త్వానికి ఎంతో విన‌యంగా.. అధినేతను ఆకాశానికి ఎత్తేసినా.. ఎవ‌రూ ఏమీ ప‌ట్టించుకోరు. అస‌లు నాయ‌కుడిగా కూడా స‌ద‌రు వ్య‌క్తి చేయాల్సింది కూడా ఇదే. ఇక‌, ఎమ్మెల్యే అయితే.. ఇటు పార్టీకి 30 శాతం ప్రాధాన్యం ఇస్తే.. త‌న‌ను గెలిపించిన 2 ల‌క్ష‌ల పైచిలుకు(మెజారిటీ ఎంతైనా రానివ్వండి) .. జ‌నాభా క‌ష్ట‌న‌ష్టాలు.. బాగోగులు చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

అంతేకాదు.. ఎక్కువ స‌మ‌యం కూడా ప్ర‌జ‌ల‌తోనే ఉండాల్సి ఉంటుంది. ప్ర‌జ‌ల‌నే ప్రశంసించాల్సి ఉంటుంది. ఇక‌, అదే నాయ‌కుడు మంత్రి అయితే.. ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. నిత్యం రాష్ట్ర స‌మస్యలు.. అభివృద్ధి, సంబంధిత శాఖ‌కు ఉన్న ల‌క్ష్యాలు.. సాధించ‌డం వ‌ర‌కే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, తాజాగా ఎన్నికై న జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చాలామంది మంత్రులు త‌మ త‌మ శాఖ‌ను వ‌దిలేసి.. సీఎం జ‌గ‌న్ భ‌జ‌న‌లో ఆరి తేరుతున్నార‌నే వాద‌న అప్పుడే గుప్పుమంటోంది.

ఇటీవ‌ల సీనియ‌ర్ నాయ‌కుడు.. తాజాగా రెవెన్యూ బాధ్య‌త‌లు చేప‌ట్టి మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. త‌న‌కంటూ..ఏమీ ల‌క్ష్యాలు వ్యాఖ్యానించారు. అంతా.. జ‌గ‌న్ ల‌క్ష్య‌మే.. త‌న ల‌క్ష్య‌మ‌ని.. వాటిని సాధించ‌డ‌మే త‌న ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనికితోడు శాఖ‌లో అవినీతి కూడా పేరుకుపోయిందన్నారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఆయ‌న వీటిపై స్పందించ‌లేదు. ఇదిలావుంటే.. తాజాగా మ‌రో మంత్రి అంబ‌టి రాంబాబు కూడా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ల‌క్ష్య‌మే.. త‌న ల‌క్ష్య‌మ‌ని.. జ‌గ‌న్ ఆశ‌య‌మే.. త‌న క‌ర్త‌వ్య‌మ‌ని, జ‌గ‌న్ ఆదేశాలే శిరోధార్య‌మ‌ని అన్నారు.

దీనికిసంబంధించి.. వైసీపీ అనుకూల మీడియాలో ఆయ‌న భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. మ‌రి ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల‌. వారికి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డ‌తాయనివారు భావిస్తున్నా.. జ‌గ‌న్ విష‌యంలో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయ‌నే విష‌యాన్ని వారు గ్ర‌హించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే గ‌త కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేశార‌నే అప‌వాదు జ‌గ‌న్‌పై ఉంది. అదినిజ‌మో కాదో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ..ఇప్పుడు ఈ మంత్రులు చేస్తున్న వింత ప్ర‌వ‌ర్త‌న‌తో.. జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

1 hour ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago