Political News

మంత్రుల జగన్ భజన.. మొద‌టికే మోసం?

ఏ పార్టీలో అయినా.. నేత‌ల‌కు.. అధిష్టానం మ‌ధ్య స‌ఖ్య‌త అవ‌స‌ర‌మే. అయితే. ఆ స‌ఖ్య‌త ఎంత వ‌ర‌కు ఉండాలి? అనేది కీల‌కం. ఒక నాయ‌కుడుగా.. ఉండ‌డం వేరు. అప్పుడు.. పార్టీ బాధ్య‌త ఒక్క‌టే ఉంటుంది. ఈ క్ర‌మంలో అధినాయ‌క‌త్వానికి ఎంతో విన‌యంగా.. అధినేతను ఆకాశానికి ఎత్తేసినా.. ఎవ‌రూ ఏమీ ప‌ట్టించుకోరు. అస‌లు నాయ‌కుడిగా కూడా స‌ద‌రు వ్య‌క్తి చేయాల్సింది కూడా ఇదే. ఇక‌, ఎమ్మెల్యే అయితే.. ఇటు పార్టీకి 30 శాతం ప్రాధాన్యం ఇస్తే.. త‌న‌ను గెలిపించిన 2 ల‌క్ష‌ల పైచిలుకు(మెజారిటీ ఎంతైనా రానివ్వండి) .. జ‌నాభా క‌ష్ట‌న‌ష్టాలు.. బాగోగులు చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

అంతేకాదు.. ఎక్కువ స‌మ‌యం కూడా ప్ర‌జ‌ల‌తోనే ఉండాల్సి ఉంటుంది. ప్ర‌జ‌ల‌నే ప్రశంసించాల్సి ఉంటుంది. ఇక‌, అదే నాయ‌కుడు మంత్రి అయితే.. ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. నిత్యం రాష్ట్ర స‌మస్యలు.. అభివృద్ధి, సంబంధిత శాఖ‌కు ఉన్న ల‌క్ష్యాలు.. సాధించ‌డం వ‌ర‌కే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, తాజాగా ఎన్నికై న జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చాలామంది మంత్రులు త‌మ త‌మ శాఖ‌ను వ‌దిలేసి.. సీఎం జ‌గ‌న్ భ‌జ‌న‌లో ఆరి తేరుతున్నార‌నే వాద‌న అప్పుడే గుప్పుమంటోంది.

ఇటీవ‌ల సీనియ‌ర్ నాయ‌కుడు.. తాజాగా రెవెన్యూ బాధ్య‌త‌లు చేప‌ట్టి మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. త‌న‌కంటూ..ఏమీ ల‌క్ష్యాలు వ్యాఖ్యానించారు. అంతా.. జ‌గ‌న్ ల‌క్ష్య‌మే.. త‌న ల‌క్ష్య‌మ‌ని.. వాటిని సాధించ‌డ‌మే త‌న ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనికితోడు శాఖ‌లో అవినీతి కూడా పేరుకుపోయిందన్నారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఆయ‌న వీటిపై స్పందించ‌లేదు. ఇదిలావుంటే.. తాజాగా మ‌రో మంత్రి అంబ‌టి రాంబాబు కూడా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ల‌క్ష్య‌మే.. త‌న ల‌క్ష్య‌మ‌ని.. జ‌గ‌న్ ఆశ‌య‌మే.. త‌న క‌ర్త‌వ్య‌మ‌ని, జ‌గ‌న్ ఆదేశాలే శిరోధార్య‌మ‌ని అన్నారు.

దీనికిసంబంధించి.. వైసీపీ అనుకూల మీడియాలో ఆయ‌న భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. మ‌రి ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల‌. వారికి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ప‌డ‌తాయనివారు భావిస్తున్నా.. జ‌గ‌న్ విష‌యంలో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయ‌నే విష‌యాన్ని వారు గ్ర‌హించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టికే గ‌త కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేశార‌నే అప‌వాదు జ‌గ‌న్‌పై ఉంది. అదినిజ‌మో కాదో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ..ఇప్పుడు ఈ మంత్రులు చేస్తున్న వింత ప్ర‌వ‌ర్త‌న‌తో.. జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 21, 2022 1:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

24 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

43 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

55 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago