ఏ పార్టీలో అయినా.. నేతలకు.. అధిష్టానం మధ్య సఖ్యత అవసరమే. అయితే. ఆ సఖ్యత ఎంత వరకు ఉండాలి? అనేది కీలకం. ఒక నాయకుడుగా.. ఉండడం వేరు. అప్పుడు.. పార్టీ బాధ్యత ఒక్కటే ఉంటుంది. ఈ క్రమంలో అధినాయకత్వానికి ఎంతో వినయంగా.. అధినేతను ఆకాశానికి ఎత్తేసినా.. ఎవరూ ఏమీ పట్టించుకోరు. అసలు నాయకుడిగా కూడా సదరు వ్యక్తి చేయాల్సింది కూడా ఇదే. ఇక, ఎమ్మెల్యే అయితే.. ఇటు పార్టీకి 30 శాతం ప్రాధాన్యం ఇస్తే.. తనను గెలిపించిన 2 లక్షల పైచిలుకు(మెజారిటీ ఎంతైనా రానివ్వండి) .. జనాభా కష్టనష్టాలు.. బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అంతేకాదు.. ఎక్కువ సమయం కూడా ప్రజలతోనే ఉండాల్సి ఉంటుంది. ప్రజలనే ప్రశంసించాల్సి ఉంటుంది. ఇక, అదే నాయకుడు మంత్రి అయితే.. ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. నిత్యం రాష్ట్ర సమస్యలు.. అభివృద్ధి, సంబంధిత శాఖకు ఉన్న లక్ష్యాలు.. సాధించడం వరకే పరిమితం కావాల్సి ఉంటుంది. అడపా దడపా మాత్రమే.. పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, తాజాగా ఎన్నికై న జగన్ 2.0 కేబినెట్లో చాలామంది మంత్రులు తమ తమ శాఖను వదిలేసి.. సీఎం జగన్ భజనలో ఆరి తేరుతున్నారనే వాదన అప్పుడే గుప్పుమంటోంది.
ఇటీవల సీనియర్ నాయకుడు.. తాజాగా రెవెన్యూ బాధ్యతలు చేపట్టి మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తనకంటూ..ఏమీ లక్ష్యాలు వ్యాఖ్యానించారు. అంతా.. జగన్ లక్ష్యమే.. తన లక్ష్యమని.. వాటిని సాధించడమే తన ముందున్న కర్తవ్యమని ఆయన చెప్పుకొచ్చారు. దీనికితోడు శాఖలో అవినీతి కూడా పేరుకుపోయిందన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వీటిపై స్పందించలేదు. ఇదిలావుంటే.. తాజాగా మరో మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్ష్యమే.. తన లక్ష్యమని.. జగన్ ఆశయమే.. తన కర్తవ్యమని, జగన్ ఆదేశాలే శిరోధార్యమని అన్నారు.
దీనికిసంబంధించి.. వైసీపీ అనుకూల మీడియాలో ఆయన భారీ ప్రకటనలు ఇచ్చారు. మరి ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల. వారికి జగన్ దగ్గర మంచి మార్కులు పడతాయనివారు భావిస్తున్నా.. జగన్ విషయంలో ప్రజల దగ్గర మైనస్ మార్కులు పడుతున్నాయనే విషయాన్ని వారు గ్రహించడం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే గత కేబినెట్లో మంత్రులుగా ఉన్నప్పటికీ.. వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేశారనే అపవాదు జగన్పై ఉంది. అదినిజమో కాదో ఎవరికీ తెలియదు. కానీ..ఇప్పుడు ఈ మంత్రులు చేస్తున్న వింత ప్రవర్తనతో.. జగన్కు మరింత డ్యామేజీ ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…