Political News

జీవీఎల్‌.. మండుతున్న రాజ‌కీయంలో పెట్రోల్ పోస్తావా?

దేశంలో `జేసీబీ` రాజకీయాలు మంట మండిస్తున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాలు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారుల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. జేసీబీల‌ను మీ ఇళ్ల‌మీద‌కే పంపిస్తామ‌ని.. అప్పుడు ఎలాంటి వివాదాలు ఉండ‌వ‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ ఏపీకి చెందిన ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఈ రాజ‌కీయ మంట‌లో త‌న‌దైన శైలిలో పెట్రోల్ పోశారు.

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను జేసీబీల‌తో తొలగించడం ప్రారంభమైన కొద్ది సేపటికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఈ ఆక్రమణలను జేసీబీ (బుల్డోజర్)తో కూల్చుతున్న నేపథ్యంలో జేసీబీ అంటే `జీహాద్ కంట్రోల్ బోర్డ్` అని పేర్కొన్నారు.

జహంగీర్‌పురి ప్రాంతంలో ఇటీవ‌ల‌ హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా దాడులు జరిగాయి. ఈ కేసులో దాదాపు 25 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా, ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఈ ప్రాంతంలోని చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించింది, కొన్ని ఆక్రమణలను తొలగించింది. అనంతరం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఆక్రమణలను తొలగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.

పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్లు వాదనలు వినిపించారు. దీంతో స్పందించిన సుప్రీం కోర్టు ఈ కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. తదుపరి విచారణ వాయిదా ప‌డింది. అయితే ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ, ఎంసీడీ అధికారులు తమ పనిని కొనసాగించారు. సీపీఎం నేత బృందా కారత్ సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులకు అందజేయడంతో బుల్డోజర్లకు బ్రేక్ పడింది.

జీవీఎల్ నరసింహారావు ఇచ్చిన ట్వీట్‌లో, JCB =  జీహాద్ కంట్రోల్ బోర్డ్! అని పేర్కొన్నారు. దీంతో వివిధ పార్టీల నేతలు ఆయనపై మండిపడ్డారు. ఈ ఆక్రమణల తొలగింపు ప్రారంభ సమయంలోనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం నేతలు బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో బుల్‌డోజ‌ర్ల బాగోతానికి జీహాద్‌ను ముడిపెడుతూ.. జీవీఎల్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత మంట‌లు రేపుతున్నాయి.

This post was last modified on April 20, 2022 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

50 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago