ఏప్రిల్ 20.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు. ఐతే ఇప్పటిదాకా జరిగిన పుట్టిన రోజులు వేరు. ఈసారి జరుగుతున్న పుట్టిన రోజు వేరు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కూడా లేని జోష్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో కనిపిస్తుండటం విశేషం.
ముఖ్యంగా గత రెండేళ్లు అయితే చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతు దారులు ఎక్కడున్నారో తెలియనంతగా ఒక శూన్యం ఆవహించింది సామాజిక మాధ్యమాల్లో. కొంతమంది మొక్కుబడిగా బాబుకు విషెస్ చెప్పడం, పోస్టులు పెట్టడం తప్పితే సందడే లేదు. కానీ ఈసారి మొత్తం కథ మారిపోయింది. చంద్రబాబు బర్త్ డే విష్తో పెట్టి హ్యాష్ ట్యాగ్ ఈ రోజు నేషనల్ లెవెల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది.
దేశ విదేశాల్లో దీని మీద పెద్ద ఎత్తున ట్వీట్స్ పడుతున్నాయి. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సాధించిన ఘనతలను గుర్తు చేస్తూ.. యువతపై, ప్రజలపై ఆయన ప్రభావాన్ని చూపిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతే కాక ఎంతోమంది ప్రముఖులు చంద్రబాబు గురించి ఏం మాట్లాడంది, ఆయన విజన్ను ఎలా కొనియాడింది వివరిస్తూ అనేక న్యూస్ క్లిప్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఇందులో కొన్ని పెయిడ్ ప్రమోషన్లు కూడా ఉండొచ్చు కానీ.. గత రెండేళ్లలో డబ్బులు పెట్టుకుని ప్రమోషన్లు చేయించాలన్నా కూడా పార్టీ మద్దతుదారుల్లో, నెటిజన్లలో సహకారం కొరవడింది. పసుపు సైనికుల్లో అసలు ఉత్సాహమే లేదు. కానీ గత ఏడాదిలో జగన్ సర్కారు మీద వ్యతిరేకత బాగా పెరగడం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ ప్రభావం సోషల్ మీడియాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నపుడు కూడా లేని జోష్, చంద్రబాబు పట్ల అభిమానం, ఆరాధన భావం ఇప్పుడు కనిపిస్తోంది. ఈ జోష్ చూసి చంద్రబాబు మరింత ఉత్సాహంగా 2024 ఎన్నికలకు సిద్ధమవుతారనడంలో సందేహం లేదు.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…