Political News

రాష్ట్రాల అప్పులపై కేంద్రం కన్నేసిందా?

అర్హతకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వంలోని వ్యయవిభాగం లేఖలు రాసింది. తమ అర్హతకు మించి అప్పులు చేస్తున్న రాష్ట్రాల ఆర్ధికపరిస్ధితులు, వాటిని ఏ పద్దతిలో సేకరిస్తున్నాయి, ఏ పద్దతిలో తీర్చబోతున్నాయనే వివరాలను తెలియజేయాలని కేంద్ర వ్యయవిభాగం నుండి అన్నీ రాష్ట్రాలకు లేఖలు వెళ్ళాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాలు తమ పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతి రాష్ట్రమూ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న విషయం తెలిసిందే.

నిజానికి కేంద్రప్రభుత్వం అన్న ఒకే ఒక్క హోదాతో రాష్ట్రాల అప్పులపై నిలదీస్తున్నది. ఎందుకంటే కేంద్రమే తన అర్హతకు మించి అప్పులు చేస్తోందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కేంద్రం 123 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. సరే కేంద్రం అడిగే స్ధితిలోను రాష్ట్రాలు సమాధానాలు చెప్పుకునే స్ధితిలోను ఉన్నాయి కాబట్టి కేంద్రం నుండి లేఖలు వెళ్ళాయి. కేంద్రంనుండి వచ్చిన లేఖ ప్రకారం సమాధానం చెప్పటానికి రాష్ట్ర ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

అన్నీ రాష్ట్రాలకు లేఖలు అందినట్లే ఏపీ ప్రభుత్వానికి కూడా అందింది. రాష్ట్రాలు కేంద్రానికి సరైన సమాధానం ఇచ్చేవరకు బహిరంగ మార్కెట్ నుండి అప్పులు చేసేందుకు అనుమతించేది లేదని కూడా వ్యయవిభాగం స్పష్టంగా తన లేఖలో చెప్పేసింది. కేంద్ర వ్యయవిభాగం అనుమతిస్తే తప్ప రిజర్వుబ్యాంకు బహిరంగ మార్కెట్ రుణాల విషయంలో ముందుకు వెళ్ళేందుకు లేదు. రాజర్వుబ్యాంకు అనుమతించకపోతే అప్పులు తీసుకోవటం కష్టమే.

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా ఏపీ విషయంలో అప్పులు తీసుకోవటంకు సంబంధించి విపరీతమైన ఆరోపణలున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ విషయంలో కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో అనేకసార్లు ఆరోపించిన విషయం అందరు చూసిందే. 2014లో ఏర్పడిన ప్రభుత్వం రు. 16 వేల కోట్ల లోటుతో మొదలైంది. తర్వాత అప్పు లక్షల కోట్లకు చేరుకుంది. అందుకనే ఇపుడు జగన్ కూడా అప్పులే చేస్తున్నారు. సరే కేంద్రం అడిగింది కాబట్టి రాష్ట్రప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో చూడాల్సిందే. 

This post was last modified on April 20, 2022 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

51 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago