Political News

వైసీపీ – టీడీపీకి సోష‌ల్ మీడియాతో స‌క్సెస్ ఎంత‌?

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ఎంత‌? వారిని ఏ మేర‌కు.. పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తుంది.?  దీనిని న‌మ్ముకుని విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు ఏపీలోని రెండు కీల‌క పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఏ రాజ‌కీయ పార్టీకైనా.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతో ఇంతో ఉంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్ట‌ర్ వీటిలో పార్టీ నేత‌లు యాక్టివ్ గా ఉంటున్నా రు. మ‌రీ ముఖ్యంగా ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న మ‌ధ్య‌మాలు.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లే. దీంతో వీటిలో త‌మ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌ణాళిక‌ల‌ను నాయ‌కులు పంచుకుంటున్నారు.

రాజ‌కీయ వేదిక‌గా.. సోష‌ల్ మీడియా మాధ్యాలు ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌డం లేదు. అయితే.. ఇవి ఏమేర‌కు.. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తాయి?  ఏమేర‌కు వారిని ఓటు బ్యాంకురాజ‌కీయాల వైపు మారుస్తాయి?  ఎంత వ‌ర‌కు ఓట్లు ల‌భిస్తాయి? అనే విష‌యాలు మాత్రం ఆస‌క్తిగా ఉన్నాయి. ముఖ్యంగా 2014లో టీడీపీ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. అదేవిధంగా సాధార‌ణ మీడియాలోనూ ప్ర‌చారం హోరెత్తించింది. గెలుపు గుర్రం ఎక్కింది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా ద్వారానే త‌మ‌కు ఓట్లు భారీగా వ‌చ్చాయ‌ని భావించింది. ఇదే సూత్రాన్ని 2019లోనూ అప్ల‌యి చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఇక‌, వైసీపీ విష‌యాన్ని తీసుకుంటే.. టీడీపీ మాదిరిగా సోష‌ల్ మీడియాలో వైసీపీ యాక్టివ్‌గానే ఉన్నా.. ఆ పార్టీ న‌మ్ముకున్నంతగా.. మాత్రం పూర్తిగా సోష‌ల్ మీడియాపై వైసీపీ ఆధార‌ప‌డ‌లేదు. దీంతో ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇది 2019లో విజ‌యం దిశ‌గా న‌డిపించింద‌ని ఆ పార్టీ న‌మ్ముతోంది. అయితే.. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. తాము కూడా మ‌రింత మారాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంది. అంటే.. టీడీపీ మాదిరిగా సోష‌ల్ మీడియాను మ‌రింత విస్తృత ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ నేప‌థ్యంలో రెండు పార్టీల‌కూ ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌ధాన అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజులుగా రెండు పార్టీలూ.. సోష‌ల్ మీడియాలో ఉపాధి క‌ల్పించి.. కార్య‌క‌ర్త‌ల‌ను కూడా నియ‌మించుకున్నా యి. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. టీడీపీ చేస్తున్న కామెంట్ల‌కు వైసీపీ కూడా కౌంట‌ర్ ఇస్తోంది. కానీ, ఇప్పుడు రెండు పార్టీల్లోనూ.. ఈ సోష‌ల్ మీడియా ఏమేర‌కు ఆశించిన ఫ‌లితాన్ని అందిస్తుంద‌నే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా వాడుతోంది. వారిలో స‌గం మంది కూడా ఓటు వేయడానికి రావ‌డం లేదు. అలాగ‌ని.. ప‌క్క‌న పెట్టేందుకు కూడా వీలు లేదు. ఈ నేప‌థ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తూ.. అటు జ‌నంలోకి వెళ్ల‌డంతోపాటు.. ఇటు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండ‌డ‌మే మంచిద‌ని.. దీనిపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌రాద‌ని.. రెండు పార్టీల నేత‌లు చ‌ర్చలు చేస్తున్నారు. 

Satya

Recent Posts

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

20 minutes ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

3 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

3 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

3 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

4 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

4 hours ago