Political News

కాంగ్రెస్ లో పీకే.. పెరుగుతున్న ప్రాధాన్యత

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోతున్నట్లే ఉంది. లేకపోతే నాలుగు రోజుల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధితో పీకే మూడుసార్లు భేటీ అయ్యే అవకాశమే లేదు. దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ నేతలు కూడా సోనియాతో రోజు సమావేశమైంది లేదు. పైగా ఒకవైపు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతు కూడా పీకేతో సోనియా భేటీ అవుతున్నారంటేనే వ్యూహకర్తకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతకు ఉదాహరణ.

అసలు పీకే చాలారోజుల క్రితమే పార్టీలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తెరవెనుక ఏమైందో ఏమో కానీ పార్టీకి పీకే దూరమైపోయారు. ఈమధ్యనే జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత మళ్ళీ పార్టీ నేతలు పీకేతో భేటీ అయ్యారు. దాని ఫలితమే రెగ్యులర్ గా సోనియాతో పీకే సమావేశాలు. ఎలాగైనా 2024 ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని సోనియా బలంగా అనుకుంటున్నారు. అయితే అందుకు అవసరమైన వ్యూహాలు మాత్రం నేతల దగ్గర లేవు.

అందుకనే వ్యూహకర్త పీకే అవసరం పార్టీకి ఉందనేది అందరికీ అర్ధమైంది. అందుకనే మళ్ళీ పీకేతో సోనియా వరుసభేటీలు జరుపుతున్నది. సోనియా-పీకే సమావేశాల్లో పార్టీ సీనియర్లు కమలనాద్, ఏకే ఆంటోని, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, జై రాం రమేష్, అంబికాసోనీ, రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. వీళ్ళతో భేటీ సందర్భంగా పీకే పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషనే ఇచ్చారు. పార్టీని క్షేత్రస్ధాయి నుండి బలోపేతం చేయకపోతే ఉపయోగం లేదని స్పష్టంగా చెప్పారట. పార్టీలోకి యువతను ఆకర్షించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారట.

పీకే ప్రజంటేషన్ పై ఒకటిరెండో రోజుల్లో సీనియర్లంతా సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెలలలో రాజస్ధాన్లో జరగబోయే చింతన్ బైఠక్ సమావేశాలు, సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. జరుగుతున్నది చూస్తుంటే పీకేకి పార్టీలో ఏదో కీలకమైన స్ధానంలోకి తీసుకునేట్లే అనిపిస్తోంది. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఆ పోస్టులో దశాబ్దాలపాటు పనిచేసిన అహ్మద్ పటేల్ చనిపోయారు. అందుకనే ఆ పోస్టు ఖాళీగా ఉంది. బహుశా పీకే ఆ పోస్టులో భర్తీ అవుతారేమో చూడాలి.

This post was last modified on April 20, 2022 10:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

25 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago