రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోతున్నట్లే ఉంది. లేకపోతే నాలుగు రోజుల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధితో పీకే మూడుసార్లు భేటీ అయ్యే అవకాశమే లేదు. దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ నేతలు కూడా సోనియాతో రోజు సమావేశమైంది లేదు. పైగా ఒకవైపు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతు కూడా పీకేతో సోనియా భేటీ అవుతున్నారంటేనే వ్యూహకర్తకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతకు ఉదాహరణ.
అసలు పీకే చాలారోజుల క్రితమే పార్టీలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తెరవెనుక ఏమైందో ఏమో కానీ పార్టీకి పీకే దూరమైపోయారు. ఈమధ్యనే జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత మళ్ళీ పార్టీ నేతలు పీకేతో భేటీ అయ్యారు. దాని ఫలితమే రెగ్యులర్ గా సోనియాతో పీకే సమావేశాలు. ఎలాగైనా 2024 ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని సోనియా బలంగా అనుకుంటున్నారు. అయితే అందుకు అవసరమైన వ్యూహాలు మాత్రం నేతల దగ్గర లేవు.
అందుకనే వ్యూహకర్త పీకే అవసరం పార్టీకి ఉందనేది అందరికీ అర్ధమైంది. అందుకనే మళ్ళీ పీకేతో సోనియా వరుసభేటీలు జరుపుతున్నది. సోనియా-పీకే సమావేశాల్లో పార్టీ సీనియర్లు కమలనాద్, ఏకే ఆంటోని, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, జై రాం రమేష్, అంబికాసోనీ, రణదీప్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. వీళ్ళతో భేటీ సందర్భంగా పీకే పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషనే ఇచ్చారు. పార్టీని క్షేత్రస్ధాయి నుండి బలోపేతం చేయకపోతే ఉపయోగం లేదని స్పష్టంగా చెప్పారట. పార్టీలోకి యువతను ఆకర్షించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారట.
పీకే ప్రజంటేషన్ పై ఒకటిరెండో రోజుల్లో సీనియర్లంతా సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెలలలో రాజస్ధాన్లో జరగబోయే చింతన్ బైఠక్ సమావేశాలు, సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. జరుగుతున్నది చూస్తుంటే పీకేకి పార్టీలో ఏదో కీలకమైన స్ధానంలోకి తీసుకునేట్లే అనిపిస్తోంది. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. ఆ పోస్టులో దశాబ్దాలపాటు పనిచేసిన అహ్మద్ పటేల్ చనిపోయారు. అందుకనే ఆ పోస్టు ఖాళీగా ఉంది. బహుశా పీకే ఆ పోస్టులో భర్తీ అవుతారేమో చూడాలి.
This post was last modified on April 20, 2022 10:26 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…