Political News

`కుప్పం` కోట‌పై వైసీపీ ఎత్తులు..

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కన్నా కూడా వ‌చ్చే ఎన్నిక ల్లో విజ‌య‌మే.. పార్టీకి ప్ర‌తిష్ట‌గా మారింది. ఈ నేప‌థ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దారు. అంతేకాదు.. గ‌త మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని.. మ‌రింత సంబ‌రాలు చేసుకోవాల‌ని.. జ‌గ‌న్ అండ్ కో బావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌రోసారి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మంత్రిగా మ‌రోసారి అవ‌కాశం ఇచ్చార‌ని.. పార్టీలోనే చ‌ర్చ జోరుగా సాగుతోం ది. అయితే.. ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌స్య వ‌చ్చింది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కుడు వైసీపీకి లేకుండా పోయారు. వ్యూహాలు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున కీల‌క అభ్య‌ర్థి, ఆయ‌న‌కు ఉండే ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంటే క‌దా!  కానీ, అలాంటి నాయ‌కుడు.. వైసీపీకి లేకుండా పోయాడ‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు వంటి కీల‌క నేతను ఇంటికి పంపించాల‌ని నిర్ణ‌యిం చుకున్నా.. ఆ రేంజ్‌లో స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు.. పోటీ చేసేందుకు వైసీపీకి ల‌బించ‌లేదు.

దీంతో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా కీల‌క‌మైన నాయ‌కుడి కోసం వెతుకుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రిని ఎంచుకున్నా.. ఆర్ధికంగా.. సామాజికంగా కూడా చంద్ర‌బాబును ఢీ కొట్టే లా ఉండాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుపై పోటీ చేసే నాయ‌కుడిని అన్వేషించే బాధ్య‌త‌ల‌ను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు ఎంపీ రెడ్డ‌ప్ప‌కు కూడా అప్పగిం చార‌ట‌. దీంతో ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో స‌మావేశాలు పెట్టారు. కీల‌కమైన నాయ‌కుడు కావాలంటూ.. ప్ర‌చారం కూడా చేస్తున్నా రు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ల‌భించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడుని ఎంపిక‌చేసి.. నిల‌బెడితే.. బాగుంటుంద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది. అయితే.. ఇక్క‌డ పోటీ చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. అయితే.. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. వెతికే ప‌నిలో ఉన్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కుప్పంలో పాగా వేసే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డికి అప్ప‌గించార‌ని.. గ‌త ఏడాది జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆయ‌నే ఇక్క‌డ వైసీపీ పాగా వేసేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని.. అందుకే ఇప్ప‌డు అసెంబ్లీ బాధ్య‌త కూడా ఆయ‌న‌కే అప్ప‌గించార‌ని.. అంటున్నారు. ఏదేమైనా.. ఎన్నివ్యూహాలు ఉన్నా..  అభ్య‌ర్థి దొర‌క‌ని ప‌క్షంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

This post was last modified on April 19, 2022 7:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

24 minutes ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

43 minutes ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

55 minutes ago

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది.…

1 hour ago

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా…

2 hours ago

పెద్ది… పెద్ద మనసు చేసుకుని చెప్పేసెయ్

ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం…

2 hours ago