Political News

`కుప్పం` కోట‌పై వైసీపీ ఎత్తులు..

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కన్నా కూడా వ‌చ్చే ఎన్నిక ల్లో విజ‌య‌మే.. పార్టీకి ప్ర‌తిష్ట‌గా మారింది. ఈ నేప‌థ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దారు. అంతేకాదు.. గ‌త మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని.. మ‌రింత సంబ‌రాలు చేసుకోవాల‌ని.. జ‌గ‌న్ అండ్ కో బావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌రోసారి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మంత్రిగా మ‌రోసారి అవ‌కాశం ఇచ్చార‌ని.. పార్టీలోనే చ‌ర్చ జోరుగా సాగుతోం ది. అయితే.. ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌స్య వ‌చ్చింది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే నాయ‌కుడు వైసీపీకి లేకుండా పోయారు. వ్యూహాలు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున కీల‌క అభ్య‌ర్థి, ఆయ‌న‌కు ఉండే ఫేస్ వాల్యూ కూడా ఇంపార్టెంటే క‌దా!  కానీ, అలాంటి నాయ‌కుడు.. వైసీపీకి లేకుండా పోయాడ‌ని.. పార్టీలో చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు వంటి కీల‌క నేతను ఇంటికి పంపించాల‌ని నిర్ణ‌యిం చుకున్నా.. ఆ రేంజ్‌లో స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌కుడు.. పోటీ చేసేందుకు వైసీపీకి ల‌బించ‌లేదు.

దీంతో ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా కీల‌క‌మైన నాయ‌కుడి కోసం వెతుకుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రిని ఎంచుకున్నా.. ఆర్ధికంగా.. సామాజికంగా కూడా చంద్ర‌బాబును ఢీ కొట్టే లా ఉండాల‌ని.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుపై పోటీ చేసే నాయ‌కుడిని అన్వేషించే బాధ్య‌త‌ల‌ను పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు ఎంపీ రెడ్డ‌ప్ప‌కు కూడా అప్పగిం చార‌ట‌. దీంతో ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో స‌మావేశాలు పెట్టారు. కీల‌కమైన నాయ‌కుడు కావాలంటూ.. ప్ర‌చారం కూడా చేస్తున్నా రు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ల‌భించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడుని ఎంపిక‌చేసి.. నిల‌బెడితే.. బాగుంటుంద‌నే భావ‌న వ్య‌క్త‌మవుతోంది. అయితే.. ఇక్క‌డ పోటీ చేసేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. అయితే.. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. వెతికే ప‌నిలో ఉన్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కుప్పంలో పాగా వేసే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డికి అప్ప‌గించార‌ని.. గ‌త ఏడాది జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆయ‌నే ఇక్క‌డ వైసీపీ పాగా వేసేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశార‌ని.. అందుకే ఇప్ప‌డు అసెంబ్లీ బాధ్య‌త కూడా ఆయ‌న‌కే అప్ప‌గించార‌ని.. అంటున్నారు. ఏదేమైనా.. ఎన్నివ్యూహాలు ఉన్నా..  అభ్య‌ర్థి దొర‌క‌ని ప‌క్షంలో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

This post was last modified on April 19, 2022 7:34 am

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

53 seconds ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

19 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

22 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago