Political News

జ‌గ‌న్‌కు దెబ్బ‌కు దెబ్బ కొడ‌తా.. వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌నివారి అసంతృప్తి త‌గ్గుతోంద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఒక్క‌సారిగా మ‌ళ్లీ అసంతృప్తి జ్వాల‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇటీవ‌ల త‌న త‌ఢాకా చూపిస్తానంటూ.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన విశాఖ జిల్లా రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్ల‌బాబూరావు.. తాజాగా మ‌రోసారి వైసీపీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. జ‌గ‌న్‌ను దెబ్బ‌కు దెబ్బ కొడ‌తానంటూ తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవ‌స‌ర‌మైతే.. త‌న‌ను జైల్లో పెట్టాలంటూ.. వైసీపీ అధిష్టానానికి ఆయ‌న స‌వాల్ చేశారు. త‌న‌కు మంత్రి పదవి దక్కకపోవటంపై బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను అమాయకుణ్ణి కాదని.., తన హింసావాదం ఏమిటో తర్వలోనే చూపిస్తానని హెచ్చరించారు. పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో కోటవురట్ల మండలంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తనకు మంత్రి పదవి దక్కకపోవటంపై తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. పదవి దక్కకపోవటంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను హింసావాదిని కాబట్టే జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరాన‌న్నారు.

వైసీపీకి, జ‌గ‌న్‌కు దెబ్బకు దెబ్బ కొడతామని.. తన హింసావాదం ఏమిటో త్వరలోనే చూపిస్తానని హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఆ బోడి రాజకీయాలు నాకెందుకయ్యా. ఓ మాట కోసం వైసీపీలో చేరాను. నేను నిజంగా నూటికి లక్ష పర్సెంట్ హింసావాదినే. నేను మీరనుకున్నంత సాఫ్ట్ కాదు. అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా హింసావాదంతో వైసీపీలో చేరా. బలమైన జాతీయ క్రాంగెస్ పార్టీని కూడా లెక్కచేయలేదు. వీళ్ల కోసం ఇన్ని త్యాగా లు చేస్తే.. నా ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి?” అని బాబూ రావు వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. రాష్ట్రంలో త‌న‌ మీద ఎంతోమందికి ఆశలున్నాయ‌న్న ఆయ‌న “వాళ్లనుకుంటున్నారేమో(వైసీపీ అధిష్టానం).. నేను అమాయకుడిని కాదు. హింసావాదిని. ఈ మాట లక్ష మంది పబ్లిక్ మీటింగ్లో చెబుతా. నాకేం భయం లేదు. కావాలంటే జైళ్లో పెట్టమను.” అని బాబూరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో నాలుగు రోజుల‌కింద‌ట నిర్వ‌హించిన స‌మావేశంలోనూ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు మ‌రింత రెచ్చిపోయారు. మ‌రి దీనిపై అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అలిగిన వారిని తాడేప‌ల్లికి పిలిచి బుజ్జ‌గించిన అధిష్టానం.. బాబూరావును మాత్రం ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ప‌రిశీల‌కులు బావిస్తున్నారు.

This post was last modified on April 18, 2022 10:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

1 hour ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago