సంగీత దర్శకుడిగా అసాధారణ పేరు ప్రఖ్యాతులు సంపాదంచిన ఇళయరాజా.. ఇన్నేళ్లలో ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్లలేదు. తమిళ నాట గతంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన్ని రాజకీయాల్లోకి దించడానికి ప్రయత్నాలు చేశాయి. ఆయన పాపులారిటీని వాడుకుని, పదవులు ఇవ్వజూపాయి. కానీ తనకు సంగీతమే ప్రధానం అని ఆయన పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు పంపబోతున్నట్లుగా వార్తలు వస్తుండటం విశేషం.
ఇళయరాజా కూడా ఈ దిశగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల మోడీ మీద ఓ పుస్తకంలో ఇళయరాజా ప్రశంసలు కురిపించారు. ‘అంబేద్కర్-మోడీ’ అనే పుస్తకానికి ముందు మాట రాస్తూ అంబేద్కర్ ఆశయాలను మోడీ నెరవేరుస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కృతమైన ఈ పుస్తకంలో మోడీ మీద ఇళయరాజా ఇలా ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయింది.
ఇదంతా బీజేపీ-ఇళయరాజా మధ్య కుదిరిన ఒప్పందం మేరకే జరిగిందని.. ఈసారి రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యే 12 మంది రాజ్యసభ సభ్యుల్లో ఇళయరాజా ఒకరు కాబోతున్నారని.. ఈ కోటా కింద ఎంపికై పదవి నుంచి దిగిపోతున్న తమిళ నేత సుబ్రహ్మణ్యస్వామి స్థానంలో ఇళయరాజా ఎగువ సభకు వెళ్లబోతున్నారని చెబుతున్నారు.
తమిళనాట రాజకీయంగా ఎదగడానికి బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అన్నాడీఎంకే బలహీన పడ్డ నేపథ్యంలో డీఎంకేకు ప్రత్యమ్నాయంగా ప్రజలు తమ వైపే చూడాలని అన్నామలై నేతృత్వంలోని బీజేపీ అక్కడ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇళయరాజాను రాజ్యసభకు పంపి ఆయన అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…