తాజాగా వెల్లడైన పార్లమెంట్, అసెంబ్లీల ఉపఎన్నికలన్నింటిలోను బీజేపీకి నిరాశే ఎదురైంది. మొత్తం అన్నీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే విజయం సాధించాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుజ్ఞ సిన్హా గెలవటం. బాబూల్ సుప్రియో బీజేపీ ఎంపీగా రాజీనామా చేసి తృణమూల్ లో చేరారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
సుప్రియో కు బదులుగా పోటీ చేసిన సిన్హాను ఎలాగైనా ఓడించాలని బీజేపీ చాలా ప్రయత్నాలే చేసింది. కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు బీజేపీ నిలవలేకపోయింది. పైగా గతంలో ఈ సీటులో బీజేపీ అభ్యర్థిగా ఉన్నపుడు సుప్రియోకు 1.97 లక్షల మెజారిటీ వస్తే ఇపుడు సిన్హాకు 3 లక్షల మెజారిటీ రావటం గమనార్హం. అంటే బీజేపీ ఖాతాలో నుండి ఒక లోక్ సభ స్థానం జారిపోయినట్లు అర్ధమవుతోంది. ఇదే సమయంలో బెంగాల్లో మమత హవా ఇంకా ఏమాత్రం తగ్గలేదని కూడా తెలుస్తోంది.
ఇదే సమయంలో బెంగాల్లోని బాలీగంజ్ అసెంబ్లీకి కూడా ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన బాబూల్ సుప్రియో సీపీఎం అభ్యర్థి సైరా షా హలీంపై 20 వేల ఓట్లకు పైగా మెజారిటితో గెలిచారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బీజేపీ అభ్యర్థి మూడోస్థానంలో ఉండిపోయారు. ఇక మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో అధికార కూటమి మహా వికాస్ ఘడీ తరపున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచారు. ఛత్తీస్ గడ్ లో కూడా అధికార కాంగ్రెస్ అభ్యర్ధి యశోదా వర్మ బీజేపీ అభ్యర్థిపై గెలిచారు.
బీహార్లోని బోచహాన్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార కూటమి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి ని ఓడించటమే ఆశ్చర్యంగా ఉంది. ఆర్జేడీ అభ్యర్ధి అమర్ పాసవాన్ 35 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అధికార కూటమిలో ఉన్నప్పటికీ ఓడిపోవటం గమనార్హం. అంటే హోలు మొత్తంమీద బీజేపీ ఎక్కడా గెలవలేదన్నది స్పష్టమైపోతోంది. రెండు ఉప ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ కు కాస్త ఉత్సాహాన్నిచ్చేదే అనటంలో సందేహంలేదు.
This post was last modified on April 18, 2022 8:21 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…