Political News

సీఎం వస్తుంటే గృహ నిర్బంధాలేనా ?

రాష్ట్రంలో పరిస్థితులు రానురాను విచిత్రంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ముందుగా గృహ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. మామూలుగా అయితే ప్రతి పక్షాల నేతలను నిర్బంధించటం జరుగుతున్నదే.

అయితే మామూలు జనాలను నిర్బంధించటం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మామూలు జనాలజోలికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మామూలు జనాలు రావటం కలిసి విజ్ఞాపనలు చేసుకోవటం చాలా సహజం. కాబట్టి పోలీసులు మామూలు జనాలను నిర్బంధించటం చాలా చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇపుడు జగన్ పర్యటించిన ప్రాంతంలో కొన్ని ఇళ్ళకు పోలీసులు తాళాలు వేయటం ఆశ్చర్యంగా ఉంది.

సీఎం పర్యటించిన ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఇళ్ళపైన పోలీసులు కాపలా ఉండటం సర్వసాధారణమే. కానీ జనాలను బయటకు రానీయకుండా తలుపులకు తాళాలు వేయటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలంటే ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి గొడవలు చేస్తారని అనుకోవచ్చు. మామూలు జనాలు అలాంటివేమీ చేయరు. మహా అయితే తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకుంటారు, పథకాలు అందటం లేదని చెప్పుకుంటారు.

ముఖ్యమంత్రి జనాల మధ్యలోకి వచ్చినపుడు కూడా ఎవరినీ కలవనీయకుండా ఇళ్ళల్లోనే ఉంచి బయట తాళాలు వేయటం అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ విషయం డైరెక్టుగా జగన్ కు తెలియకపోవచ్చు. కానీ కింద స్ధాయి అధికారులు కావచ్చు లేదా నేతల నిర్ణయం వల్ల జరిగిన దానికి సమాధానం మాత్రం జగనే చెప్పుకోవాలి. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని జగన్ గ్రహించాలి. పాదయాత్రలో లక్షలాది మంది జనాలను కలిసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు దూరంగా ఉంటారు ? ఇది కచ్చితంగా జిల్లా స్థాయి లేదా సదరు ఎంఎల్ఏ నుండి వచ్చిన ఆదేశాలే అయ్యుండాలి. ఏదేమైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం జగన్ పైనే ఉంది.

This post was last modified on April 17, 2022 4:42 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

1 hour ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

1 hour ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

2 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

2 hours ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

3 hours ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

3 hours ago