Political News

సీఎం వస్తుంటే గృహ నిర్బంధాలేనా ?

రాష్ట్రంలో పరిస్థితులు రానురాను విచిత్రంగా తయారవుతోంది. ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ముందుగా గృహ నిర్బంధాలు ఎదురవుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా ఇలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. మామూలుగా అయితే ప్రతి పక్షాల నేతలను నిర్బంధించటం జరుగుతున్నదే.

అయితే మామూలు జనాలను నిర్బంధించటం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఎవరున్నా మామూలు జనాలజోలికి వెళ్ళరు. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మామూలు జనాలు రావటం కలిసి విజ్ఞాపనలు చేసుకోవటం చాలా సహజం. కాబట్టి పోలీసులు మామూలు జనాలను నిర్బంధించటం చాలా చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఇపుడు జగన్ పర్యటించిన ప్రాంతంలో కొన్ని ఇళ్ళకు పోలీసులు తాళాలు వేయటం ఆశ్చర్యంగా ఉంది.

సీఎం పర్యటించిన ప్రాంతంలో ముందు జాగ్రత్తగా ఇళ్ళపైన పోలీసులు కాపలా ఉండటం సర్వసాధారణమే. కానీ జనాలను బయటకు రానీయకుండా తలుపులకు తాళాలు వేయటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది. ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలంటే ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి గొడవలు చేస్తారని అనుకోవచ్చు. మామూలు జనాలు అలాంటివేమీ చేయరు. మహా అయితే తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకుంటారు, పథకాలు అందటం లేదని చెప్పుకుంటారు.

ముఖ్యమంత్రి జనాల మధ్యలోకి వచ్చినపుడు కూడా ఎవరినీ కలవనీయకుండా ఇళ్ళల్లోనే ఉంచి బయట తాళాలు వేయటం అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ విషయం డైరెక్టుగా జగన్ కు తెలియకపోవచ్చు. కానీ కింద స్ధాయి అధికారులు కావచ్చు లేదా నేతల నిర్ణయం వల్ల జరిగిన దానికి సమాధానం మాత్రం జగనే చెప్పుకోవాలి. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న విషయాన్ని జగన్ గ్రహించాలి. పాదయాత్రలో లక్షలాది మంది జనాలను కలిసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు దూరంగా ఉంటారు ? ఇది కచ్చితంగా జిల్లా స్థాయి లేదా సదరు ఎంఎల్ఏ నుండి వచ్చిన ఆదేశాలే అయ్యుండాలి. ఏదేమైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం జగన్ పైనే ఉంది.

This post was last modified on April 17, 2022 4:42 pm

Share
Show comments
Published by
satya
Tags: Jagan

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

2 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

3 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

3 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

4 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

5 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

6 hours ago