Political News

వివాదాలతో మొదలుపెట్టిన మంత్రులు

జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్-2లో కొందరు మంత్రులు వివాదాలతో తమ బాధ్యతలను మొదలుపెట్టారు. వివిధ కారణాలపై ఐదుగురు మంత్రులపై వివాదాలు ముసురుకున్నా నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ పై వస్తున్న వివాదాలు తీవ్రమైనవే. కాకాణిపై గతంలోనే ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు నెల్లూరు కోర్టులో ఉన్నాయి.

ఎప్పుడైతే కాకాణి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో వెంటనే కోర్టులో దొంగలు పడి ఆధారాలని చెబుతున్న మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లాంటి వాటిని ఎత్తుకెళ్ళారు. కోర్టులోనే దొంగలు పడటం, అందులోను కాకాణి ఎదుర్కొంటున్న కేసులోని ఆధారాలు మాయమయ్యాయనే ప్రచారం సంచలనంగా మారింది. సహజంగానే అందరి చూపులు ఇపుడు మంత్రి మీదే నిలిచాయి. కాకాణే ఆధారాలను దొంగతనం చేయించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే ఇదంతా కాకాణి ప్రత్యర్ధులపనే అంటు మంత్రి మద్దతుదారులు గట్టిగా వాదిస్తున్నారు. ప్రత్యర్ధులంటే ఎవరనే విషయం మెల్లిగా తెలుస్తుంది. ఏదేమైనా దర్యాప్తులో అన్నీ విషయాలు బయటపడతాయి. ఇక ఉషశ్రీ చరణ్ కు స్వాగతం చెప్పే నేపథ్యంలో ట్రాఫిక్ నిలిపేసిన కారణంగా ఒక చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. అయితే జిల్లా ఎస్పీ ఫకీరప్ప మాత్రం అదంతా తప్పుడు ఆరోపణలుగా కొట్టేశారు. బాధితుడు తన కూతురుని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళిన సీసీ కెమెరాల ఫుటేజీని మీడియాకు చూపించారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అనేక సార్లు కోర్టులో డీజీపీ నిలబడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి తప్పు చేయలేదని పోలీసులు చెబుతున్నా జనం నమ్మడం లేదు.

ఇక దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు నిజంగా వివాదంతో సంబంధంలేదు. కానీ వివాదానికి సమాధానం చెప్పాల్సింది మాత్రం మంత్రే. ఇక బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అత్యుత్సాహంతో జగన్ ను ఆరాధించండని చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదమయ్యాయి. చివరగా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు షేక్ హ్యాండిచ్చిన ఓ కార్యకర్త మంత్రి చేతిని గట్టిగా పిసికేశాడు. దాంతో మంత్రికి మండిపోయి సదరు కార్యకర్తపై చేయిచేసుకున్నారు.

This post was last modified on April 17, 2022 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago