Political News

ఏపీ మంత్రులూ ఖ‌బ‌డ్దార్‌.. చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీలో కొత్త‌గా ప‌దువులు చేప‌ట్టిన జ‌గ‌న్ కేబినెట్ 2.0లోని మంత్రుల‌కు టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. మంత్రులూ ఖ‌బ‌డ్దార్‌ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల గ‌డిచిన రెండు రోజుల్లో కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రులు చేసిన నిర్వాకాల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఇద్ద‌రు మంత్రుల విష‌యంలో చంద్ర‌బాబు మ‌రింత ఫైర‌య్యారు. దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ శ్రీకాళ‌హ‌స్తి దేవాల‌యంలో చూపిన అత్యుత్సాహంతో ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు క్యూలైన్ల‌లోనే స్పృహ‌త‌ప్పి ప‌డిపోయార‌ని.. ఇంత అత్యుత్సాహం ఎందుక‌ని.. నిల‌దీశారు. మంత్రి అయితే.. మాత్రం సామాన్య భ‌క్తుల‌కు విలువ ఇవ్వ‌రా? అని నిల‌దీశారు.

ఇక‌, అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ర్యాలీ సందర్భంగా వాహనాలు నిలిచిపోయి.. ఆస్పత్రికి వెళ్తున్న చిన్నారి మృతిచెందడంపైనా చంద్ర‌బాబు ఆవేద‌న, ఆందోళన వ్య‌క్తం చేశారు. ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఆర్భాటంతో పసిబిడ్డ ప్రాణాలు పోవడం కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే సకాలంలో వైద్యం అందక చిన్నారి ప్రాణాలు విడిచిందని విమర్శించారు.

అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెబుతారని చంద్రబాబు మండిపడ్డారు. చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని ప్రాధేయపడినా, పోలీసులు వదలకపోవడంతోనే నడిరోడ్డుపైనే చిన్నారి కన్నుమూసిం దని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంత్రి బాధితులను పరామర్శించ లేదని మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికైనా.. ఏపీ మంత్రులు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌నే స్పృహ‌లోకి రావాల‌ని.. చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. మంత్రుల తీరు మార‌క‌పోతే.. ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటామ‌న్నారు.

అనంతపురం జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం.. ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి నియోజకవర్గానికి వస్తుందని.. కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు సందర్భంగా ఆ మార్గంలో పోలీసులు.. వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆ వాహనం ట్రాఫిక్లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో… ఆ చిన్నారి మృతి చెందింది.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

1 hour ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

2 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago