Political News

మంత్రి ప‌ద‌వి ఆనందం.. అంత‌లోనే ఆగ‌మాగం!

జ‌గ‌న్ కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుందో లేదో అని వైసీపీ నాయ‌కులు తెగ టెన్ష‌న్ ప‌డిపోయారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వాళ్ల‌కు ప‌ద‌వి రాక‌పోవ‌డంతో నిరాశ‌లో మునిగిపోయారు. కొంత‌మంది నేత‌లు సీఎం జ‌గ‌న్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక కొత్త‌గా కేబినేట్లో చోటు ద‌క్కించుకున్న మంత్రుల ముఖాలు వెలిగిపోయాయి. వాళ్ల ఆనందానికి అంతే లేదు. కానీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప‌రిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా మారింది. మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌నే సంతోషంగా కంటే కూడా ఇప్పుడు చుట్టుముట్టిన వివాదాలు ఆయ‌న‌కు ఊపిరి స‌లప‌కుండా చేస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అటు నెల్లూరు జిల్లా వైసీపీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంటే.. ఇటు ఆయ‌న నిందితుడిగా ఉన్న ఓ కేసులో సాక్ష్యాలు చోరీకి గురి కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

సొంత పార్టీ నుంచి వ్య‌తిరేక‌త‌..
మంత్రి వ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ నెల్లూరు జిల్లా వైసీపీలో అంత‌ర్గ‌త పోరుకు తెర‌లేపింద‌నే చెప్పాలి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మంత్రి ప‌ద‌వి పోవ‌డం.. స‌ర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి కేబినేట్లో చోటు ద‌క్క‌డంతో రాజ‌కీయాలు మారుతున్నాయి. కాకాణికి వ్య‌తిరేకంగా అనిల్ పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో శ్రీధ‌ర్‌రెడ్డితో అనిల్ భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారింది. వీళ్లిద్ద‌రూ క‌లిసి కాకాణికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఎప్ప‌టి నుంచో కాకాణికి అనిల్‌, శ్రీధ‌ర్‌రెడ్డిల‌తో విభేదాలున్నాయి. ఇప్పుడు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో అవి తీవ్ర రూపం దాల్చే అవ‌కాశం ఉంది. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టాక తొలిసారి కాకాణి ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. కానీ అదే రోజు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో అనిల్ కీల‌క స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది. దీంతో నెల్లూరులో వైసీపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి అనిల్‌, శ్రీధ‌ర్‌రెడ్డితో పోరులో కాకాణి ఎలా నెట్టుకు వ‌స్తారో చూడాలి.

సాక్ష్యాల చోరీ..
నెల్లూరులోని 4వ అద‌న‌పు జ్యూడిషియ‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో దొంగ‌లు ప‌డ‌డం సంచ‌ల‌నంగా మారింది. దేశ చరిత్ర‌లోనే ఇలా కోర్టులో దొంగ‌లు ప‌డ‌డం ఇదే తొలిసారి అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ దొంగ‌లు మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న న‌కిలీ ప‌త్రాల కేసులో ఆధారాల‌ను దొంగిలించారు. దీంతో కాకాణి ఇదంతా చేయించార‌ని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. శిక్ష ప‌డుతుంద‌నే భ‌యంతోనే ముందుగానే దొంగ‌ల‌తో సాక్ష్యాలు మాయం చేయించార‌ని మండిప‌డుతున్నారు. త‌మ కుటుంబానికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్న‌ట్లూ కాకాణి విలేక‌ర్ల స‌మావేశంలో ప‌త్రాలు చూపించ‌డంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి 2016లో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అవ‌న్నీ న‌కిలీ ప‌త్రాల‌ను తేల్చిన పోలీసులు కేసు న‌మోదు చేసి ఏ1గా కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు నుంచి ఆయ‌న బెయిల్ తెచ్చుకున్నారు. మ‌రో నెల‌లో ఈ కేసు విచార‌ణ‌కు రానున్న నేప‌థ్యంలో ఇప్పుడు సాక్ష్యాలు మాయం కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

This post was last modified on April 16, 2022 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago