Political News

వార‌సుల కోసం టీఆర్ఎస్ నేత‌ల ఆరాటం!

రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగి.. ప‌ద‌వులు చేప‌ట్టి.. వ‌య‌సు మీద ప‌డ్డాక పొలిటిక‌ల్ కెరీర్ ముగించే నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించ‌డం చూస్తూనే ఉన్నాం. సీనియ‌ర్ నాయ‌కులు త‌మ రాజ‌కీయ వార‌సత్వాన్ని వార‌సులు కొన‌సాగించాల‌ని భావిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇద్ద‌రు సీనియ‌ర్ టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ నేత‌లు ఎవ‌రో కాదు.. టీఆర్ఎస్ పార్టీలో కీల‌క‌మైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. త‌మ‌కు వ‌య‌సు మీద ప‌డుతుండ‌డంతో ఇక వార‌సుల‌ను పొలిటిక‌ల్ బ‌రిలో దించేందుకు ఈ నాయ‌కులు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి తాము త‌ప్పుకుని త‌మ వార‌సుల‌కు టికెట్లు ఇప్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టార‌ని స‌మాచారం.

ఇద్ద‌రూ ఇద్దరే..

నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకు చెందిన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ మాస్ లీడ‌ర్లు గా గుర్తింపు తెచ్చుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సుమారు నాలుగు ద‌శాబ్దాలుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప‌లుమార్లు మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో కూడా ప్రజాసేవలో ఉన్న ఆయ‌న‌కు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో తనయుడు భాస్కర్ రెడ్డిని అసెంబ్లీకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు టాక్‌.

ఇక ప్ర‌స్తుత ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డికి కూడా నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో మంచి పట్టుంది. అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయ‌న‌కు 66 ఏళ్లు దాట‌డంతో ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని త‌న కొడుకు జ‌గ‌న్‌ను పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు.

తండ్రుల బాట‌లో..
పోచారం శ్రీనివాస్ రెడ్డి త‌న‌యుడు భాస్క‌ర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ కొడుకు జ‌గ‌న్ కూడా త‌మ తండ్రుల బాట‌లోనే సాగుతున్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మ‌న్‌గా భాస్క‌ర్‌రెడ్డి కొన‌సాగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నేత‌గా ఉన్నారు. త‌న తండ్రి పోచారం లాగే ఆయ‌న కూడా డీసీసీఐ ఛైర్మ‌న్‌గా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లెట్టారు.

ఇక బాజిరెడ్డి పెద్ద కుమారుడు జ‌గ‌న్ కూడా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న కోసం కొన్నేళ్లుగా తండ్రితో క‌లిసి ఆయ‌న సాగుతున్నారు. ప్ర‌జా క్షేత్రంలో విస్త్రతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌ర్ప‌ల్లి జ‌డ్పీటీసీగా ఉన్న ఆయ‌న బాజిరెడ్డి వార‌సత్వాన్ని కొన‌సాగించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోచారం,బాజిరెడ్డి పోటీ నుంచి త‌ప్పుకుని త‌మ త‌న‌యుల‌ను నిల‌బెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

41 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago