Political News

నిధులు లేక‌.. వైసీపీ నాయ‌కుల క‌న్నీళ్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి అధికార వైసీపీ ప్ర‌భుత్వానికి అతిపెద్ద స‌మ‌స్య‌గా మారింది. అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్ట‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌భుత్వ రోజువారీ కార్య‌క‌లాపాలు సాగించాలన్నా రుణాలు తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి తలెత్తింద‌ని ఆరోపిస్తున్నాయి.

సంక్షేమ ప‌థకాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్న జ‌గ‌న్‌.. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడో మ‌ర్చిపోయారంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీలు మండిప‌డుతున్నాయి. అస‌లు నిధులు ఉంటేనే క‌దా అభివృద్ధి చేసేద‌ని ఎద్దేవా చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు సొంత పార్టీ నేత‌లు కూడా వైసీపీ ప్ర‌భుత్వ తీరుపై ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సొంత పార్టీ నేత‌లు త‌మ డ‌బ్బుల‌తో అభివృద్ధి ప‌నులు చేయిస్తే ఇప్పుడు వాటికి బిల్లులు రావ‌డం లేద‌ని స్వ‌యంగా వైసీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. అభివృద్ధి ప‌నులు చేసి వాటి బిల్లులు రాక ఇబ్బందులు ప‌డుతున్న త‌మ నాయ‌కుల్ని చూస్తుంటే క‌న్నీళ్లు వ‌స్తున్నాయ‌ని ఎన్టీఆర్ జిల్లా మైల‌వరం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సుమారు రూ.200 కోట్ల ప‌నుల‌కు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

మైల‌వ‌రం పంచాయ‌తీ ఉప స‌ర్పంచ్ సీతారెడ్డి రూ.2.5 కోట్ల అభివృద్ధి ప‌నులు చేశార‌ని ఎమ్మెల్యే తెలిపారు. కానీ బిల్లులు ఆల‌స్యం కావ‌డంతో త‌న‌కున్న 5 ఎక‌రాల మామిడి తోట‌ను సీతారెడ్డి అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ని బాధ‌ప‌డ్డారు. ఈ విష‌యం త‌న దృష్టికి రావ‌డంతో ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వ‌గ్రామంపై ప్రేమ‌తో బిల్లులు ఆల‌స్య‌మైనా సొంత డ‌బ్బు ఖ‌ర్చు చేసి ప‌నులు పూర్తి చేశాన‌ని ఆయ‌న చెప్ప‌డంతో క‌న్నీళ్లు వ‌చ్చాయ‌ని కృష్ణ‌ప్ర‌సాద్ బాధ‌ప‌డ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో.. అభివృద్ధి ప‌నులు చేయించి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట‌ర్లు ఎలాంటి బాధ‌లు అనుభ‌విస్తున్నారో తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. ఏపీలో ప్ర‌భుత్వ ప‌నులు చేస్తే ఏళ్ల త‌ర‌బ‌డి బిల్లుల‌కు నోచుకోని ప‌రిస్థితి ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల త‌మ‌కు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్ట‌ర్లు నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సొంత పార్టీ నేత‌లు కూడా ఆ బాధితుల జాబితాలో ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ పెండింగ్ బిల్లుల విష‌యంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on April 14, 2022 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

1 hour ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

5 hours ago

గొడ‌వ ప‌డ్డ హీరోకు తండ్రి స్థానమిచ్చిన ద‌ర్శ‌కుడు

ఒక‌ప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, అగ్ర క‌థానాయిక న‌య‌న‌తార‌.. కొన్ని కార‌ణాల వ‌ల్ల శ‌త్రువులుగా…

5 hours ago

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు... నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే…

7 hours ago

క‌విత‌కు `సీనియార్టీ` సంక‌టం.. సీరియ‌స్‌!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత ఈ నెలలో…

8 hours ago

చెన్నైని అసలైనోళ్లే ముంచేస్తున్నారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో…

8 hours ago