ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధికార వైసీపీ ప్రభుత్వానికి అతిపెద్ద సమస్యగా మారింది. అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో సీఎం జగన్ విఫలమవుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలు సాగించాలన్నా రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నాయి.
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచేందుకు ప్రాధాన్యతనిస్తున్న జగన్.. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడో మర్చిపోయారంటూ ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి. అసలు నిధులు ఉంటేనే కదా అభివృద్ధి చేసేదని ఎద్దేవా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సొంత పార్టీ నేతలు తమ డబ్బులతో అభివృద్ధి పనులు చేయిస్తే ఇప్పుడు వాటికి బిల్లులు రావడం లేదని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కుండ బద్ధలు కొట్టారు. అభివృద్ధి పనులు చేసి వాటి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తమ నాయకుల్ని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.200 కోట్ల పనులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
మైలవరం పంచాయతీ ఉప సర్పంచ్ సీతారెడ్డి రూ.2.5 కోట్ల అభివృద్ధి పనులు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కానీ బిల్లులు ఆలస్యం కావడంతో తనకున్న 5 ఎకరాల మామిడి తోటను సీతారెడ్డి అమ్ముకోవాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆయనకు క్షమాపణ చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వగ్రామంపై ప్రేమతో బిల్లులు ఆలస్యమైనా సొంత డబ్బు ఖర్చు చేసి పనులు పూర్తి చేశానని ఆయన చెప్పడంతో కన్నీళ్లు వచ్చాయని కృష్ణప్రసాద్ బాధపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో.. అభివృద్ధి పనులు చేయించి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు కళ్లకు కడుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ పనులు చేస్తే ఏళ్ల తరబడి బిల్లులకు నోచుకోని పరిస్థితి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల తమకు బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా ఆ బాధితుల జాబితాలో ఉండడం గమనార్హం. మరి జగన్ పెండింగ్ బిల్లుల విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on April 14, 2022 3:53 pm
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…
ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…
ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…
సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…