హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై బాగా సిరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ పిటీషన్ను చాలా సీరియస్ గా తీసుకుంటామని న్యాయమూర్తి శ్రీలక్ష్మిని తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళ కాంపౌండ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే దీన్ని చాలెంజ్ చేస్తు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
దీన్ని విచారించిన కోర్టు వెంటనే స్కూళ్ళల్లో గ్రామ సచివాలయాలను, భరోసా కేంద్రాలను తొలగించాలని తీర్పు చెప్పింది. తొలగింపు సాధ్యం కాకపోతే కనీసం స్కూలుకు గ్రామ సచివాలయం, భరోసా కేంద్రాలకు మధ్య పార్టిషన్ వాల్ అయినా కట్టాలని ఆదేశించింది. అయితే స్కూల్ కాంపౌండ్ నుండి తొలగించలేదు, కనీసం పార్టిషన్ వాల్ కూడా నిర్మించలేదు. దాంతో సంబంధిత ఎనిమిది మంది ఐఏఎస్ లను కోర్టు పిలిపించి బాగా అక్షింతలేసింది.
కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు 12 ఆదివారాలు ఎనిమిది మంది సమాజ సేన చేయాలని ఆదేశించింది. అప్పుడు కోర్టు ఆదేశాలను అంగీకరించిన ఐఏఎస్ ల్లో తర్వాత శ్రీలక్ష్మి సమాజసేన చేయాలన్న ఆదేశాలపై పునఃసమీక్ష కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు శ్రీలక్ష్మిపై బాగా సీరియస్ అయ్యింది. అప్పుడు సమాజ సేవను అంగీకరించిన తర్వాత మళ్ళీ పునఃసమీక్ష కోరుతూ కోర్టులో పిటిషన్ వేయటం ఏమిటంటు మండిపోయింది. తమ ఆదేశాలను ఎనిమిది మంది ఐఏఎస్ లు కనీసం చదవను కూడా లేదని తెలియటంతో న్యాయమూర్తి ఆగ్రహం పట్టలేకపోయారు.
పునఃసమీక్ష పిటీషన్లో స్కూళ్ళ కాంపౌండ్లలో గ్రామ సచివాలయాలు, భరోసా కేంద్రాలను తొలగించినట్లు చెప్పటాన్ని కూడా తప్పుపట్టారు. కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసును రీఓపెన్ చేయబోతున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కోర్టు ఆదేశాలు అమలు చేయకుండానే చేసినట్లు తప్పుడు అఫిడవిట్ దాఖలు వేసిన ఫలితాన్ని ఇపుడు ఎనిమిది ఐఏఎస్ లు అనుభవించాల్సొస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…