ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెద్ద దుమారం రేపుతోంది. ఆశావహులు చెలరేగిపోతున్నారు. వారిని శాంతింపజేసేందుకు దూతలు చర్చలు జరుపుతున్నారు. అయినా వారిని శాంతింపజేయడం అధికార పార్టీకి తెలనొప్పిగా మారింది. ఈ క్రమంలో విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే.. ఆయన తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని, హింసా రాజకీయాలు చేస్తానని సీఎం జగన్కు అల్టిమేటం జారీ చేశారు.
జగన్ కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. బలమైన కాంగ్రెస్ను ఎదిరించానని తెలిపారు. అయినా.. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. తన కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని హెచ్చరించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినా మంత్రి పదవి ఇవ్వలేదని వాపోయారు. తన కోసం వందల మంది నాయకులు.. పాయకరావుపేట నుండి తరలివచ్చారని తెలిపారు. ఇకపై అగ్రెసివ్గా ముందుకెళ్తానని బాబూరావు హెచ్చరించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగలు వైసీపీలో ఇంకా తగ్గలేదు. కొన్నిచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పదవి రానందుకు అసంతృప్తి లేదంటూనే పలువురు నేతలు అలకబూనారు. పదవులు ఆశించి భంగపడిన వారి అనుచరులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ నిర్ణయాలకు తిరుగులేదు. 2019 మే 8న కొలువుతీరిన తొలి మంత్రివర్గం కూర్పుపైనా ఆయన్ను వేలెత్తిచూపేందుకు ఎవరూ సాహసించలేదు.
కానీ మూడేళ్లకే పరిస్థితులు మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణపై నిరసనలు హోరెత్తాయి. పైకి అంతా బాగుందంటున్నా.. పదవి దక్కని నేతల ముఖాల్లో చిరునవ్వే కరువైంది. ఇప్పటి వరకూ తనవాళ్లు తనను పొగడ్తలతో ముంచెత్తడం, ప్రతిపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడమే చూసిన జగన్కు.. వాళ్ల అసంతృప్తి, వారి అనుచరులు, కార్యకర్తల ఆగ్రహావేశాలు నివ్వెరపరిచాయని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాబూరావు.. 2019 ఎన్నికల్లో రిజర్వ్డ్ నియోజకవర్గం పాయకరావు పేట నుంచి పోటీ చేసి.. విజయం సాధించారు. ఎస్సీల్లో మంచి పట్టున్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం.. హెచ్చరికలు జారీ చేయడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…