Political News

జ‌గ‌న్ బాదుడుతో జ‌నం విలవిల‌.. చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పైటీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. జ‌నాల్ని ఇలా బాదేస్తారా? అని నిల‌దీశారు. ముఖ్యమం త్రి జగన్ ‘బాదుడే బాదుడు’ చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు.

ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కవగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. ప్రభుత్వం తన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్న చంద్రబాబు.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం. డీజిల్ సెస్ పేరుతో చేసిన ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలి. అధికారంలోకి వచ్చాక రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. విలీనం అయ్యాక ఆర్టీసీకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమే. ప్రతి వారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాటుగా మారింది. ఇప్పటికే విద్యుత్‌, చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. అని బాబు వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, ఏపీ స‌ర్కారు డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది. దీనిపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

1 hour ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

2 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

4 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

4 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

6 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

7 hours ago