రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆదాయ మార్గాల వైపే చూస్తారు. ఉన్న వ్యాపారాలను పెంచుకోవడం, కొత్తగా ఆదాయం పొందడానికి చూడటం.. ఇదే జరుగుతుంటుంది. తమ పార్టీ తరఫున ఏవైనా సహాయ కార్యక్రమాలు చేసినా.. అవి పార్టీకి వచ్చే విరాళాలతోనే చేస్తారు. లేదంటే పార్టీలో ఉన్న బిగ్ షాట్లతో ఖర్చు పెట్టిస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులతోనే పార్టీని నడుపుతూ వస్తున్నారు.
జనసైనికులు, పార్టీ మద్దతుదారులు ఏమీ ఆశించకుండా ఇచ్చే చిన్న చిన్న విరాళాలు కూడా దానికి తోడవుతుంటాయి. సినిమాల్లో నటించడం గురించి ఎన్నో విమర్శలు చేస్తుంటారు కానీ.. అక్కడొచ్చే డబ్బులతో పవన్ ఏ స్థాయిలో సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడో, పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలకు కూడా ఎంత తోడ్పాటునందిస్తున్నాడో చూడరు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాల కోసం తన వ్యక్తిగత డబ్బులు ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి.. ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పవన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ మీద ప్రశంసల జల్లు కురిసింది. ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో మొదలుపెట్టిన సందర్భంగా పవన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్య అందించేందుకు ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు. ఇది తాము అధికారంలోకి వచ్చాక చేస్తామన్న పని కాదని.. సత్వరం ఈ నిధి మొదలవుతుందని, దీనికి అవసరమైన మొత్తంలో సగం డబ్బులు తాను వ్యక్తిగతంగా ఇస్తానని, మిగతాది జనసేన నాయకులు ఇస్తామని తనకు హామీ ఇచ్చారని పవన్ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించాడు. ఈ విషయంలో పవన్ను ఎంత అభినందించినా తక్కువే.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధాన మంత్రిగా ఇప్పటి వరకు…
పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…