సీఎం జగన్ తన మంత్రి వర్గ కూర్పులో.. సరైన ప్రమాణాలు పాటించలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో తొలి కేబినెట్ను ఏర్పాటు చేసుకున్న సమయంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి న ఆయన ఈ దఫా మంత్రి వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే చర్చ జోరుగా సాగింది. ఎందుకంటే.. వచ్చేది కీలకమైన ఎన్నికల నామ సంవత్సరం కావడంతో.. ఖచ్చితంగా ఈ రెండేళ్లలో ఆయా సామాజిక వర్గాలను సాధ్యమైనంత వరకు ప్రభావితం చేస్తారని.. అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వర్గ కూర్పుపై అన్ని సామాజిక వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.
అయితే.. ఊహించని విధంగా సీఎం జగన్.. మంత్రి వర్గ కూర్పులో కీలకమైన నాలుగు సామాజిక వర్గాల ను.. పక్కన పెట్టేశారు. వీటిలో అత్యంత కీలకమైన కమ్మ సామాజికవర్గం ఉండడం గమనార్హం. అంతేకా దు.. వైశ్య సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టారు. గత మంత్రి వర్గంలోఈ రెండు వర్గాలకుచెందిన కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్కు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ దఫా వీరిని పక్కన పెట్టడంతో పాటు.. కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. ఇక, మరో కీలకమైన సామాజిక వర్గం.. క్షత్రియ. ఈ వర్గం నుంచి గత కేబినెట్లో శ్రీరంగనాథరాజు ఉన్నారు.
అయితే… ఈయన స్థానంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజుకు అవకాశం కల్పిస్తారని.. ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ప్రసాదరాజు కూడా.. ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఆయనను కూడా పక్కన పెట్టారు. ఇక, బ్రాహ్మణ సామాజిక వర్గానికి గత కేబినెట్లోనూ చోటు దక్కలేదు. దరిమిలా.. ఇప్పుడైనా.. చోటు దక్కుతుందని ఆశించారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ఉన్నారు. అయితే.. వీరిలో మల్లాదికి ఖచ్చితంగా మంత్రి పీఠం దక్కుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయనను కూడా పక్కన పెట్టారు.
అంతేకాదు.. ఈ నాలుగు సామాజిక వర్గాల నుంచి ఎవరినీ తీసుకోకపోవడం గమనార్హం. ఇది .. జగన్ కూర్పుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు.. కొత్త ముఖాలైన విడదల రజనీ కి అవకాశం కల్పించడంపై.. గుంటూరు రాజకీయం గరంగరంగా మారిపోయింది. ఇక్కడే మరో విషయం చర్చకు వస్తోంది. ఈ కోసం సీటు త్యాగం చేసిన కమ్మనాయకుడు.. సీనియర్ నేత.. మర్రి రాజశేఖర్ను అసలు జగన్ ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికిఆయన కోరకుండానే మంత్రి పదవి ఇస్తానని.. జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు.
This post was last modified on April 10, 2022 9:20 pm
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…