Political News

క‌మ్మ‌, వైశ్య‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణుల‌కు ద‌క్క‌ని చోటు

సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గ కూర్పులో.. స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న స‌మ‌యంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చి న ఆయ‌న ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగింది. ఎందుకంటే.. వ‌చ్చేది కీల‌క‌మైన ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డంతో.. ఖ‌చ్చితంగా ఈ రెండేళ్ల‌లో ఆయా సామాజిక వ‌ర్గాల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్రభావితం చేస్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి వ‌ర్గ కూర్పుపై అన్ని సామాజిక వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి.

అయితే.. ఊహించ‌ని విధంగా సీఎం జ‌గ‌న్‌.. మంత్రి వ‌ర్గ కూర్పులో కీల‌క‌మైన నాలుగు సామాజిక వ‌ర్గాల ను.. ప‌క్క‌న పెట్టేశారు. వీటిలో అత్యంత కీల‌క‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకా దు.. వైశ్య సామాజిక వ‌ర్గాన్ని కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త మంత్రి వ‌ర్గంలోఈ రెండు వ‌ర్గాల‌కుచెందిన కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఈ ద‌ఫా వీరిని ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు.. కొత్తగా ఎవ‌రినీ తీసుకోలేదు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం.. క్ష‌త్రియ‌. ఈ వ‌ర్గం నుంచి గ‌త కేబినెట్‌లో శ్రీరంగ‌నాథ‌రాజు ఉన్నారు.

అయితే… ఈయ‌న స్థానంలో న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజుకు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని.. ఎప్ప‌టినుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు.. ప్ర‌సాద‌రాజు కూడా.. ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. ఇక‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి గత కేబినెట్లోనూ చోటు ద‌క్క‌లేదు. ద‌రిమిలా.. ఇప్పుడైనా.. చోటు ద‌క్కుతుంద‌ని ఆశించారు. ఈ క్ర‌మంలో డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణులు ఉన్నారు. అయితే.. వీరిలో మ‌ల్లాదికి ఖ‌చ్చితంగా మంత్రి పీఠం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు.

అంతేకాదు.. ఈ నాలుగు సామాజిక వ‌ర్గాల నుంచి ఎవ‌రినీ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది .. జ‌గ‌న్ కూర్పుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రోవైపు.. కొత్త ముఖాలైన విడ‌ద‌ల ర‌జ‌నీ కి అవకాశం క‌ల్పించ‌డంపై.. గుంటూరు రాజ‌కీయం గ‌రంగ‌రంగా మారిపోయింది. ఇక్క‌డే మ‌రో విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ కోసం సీటు త్యాగం చేసిన క‌మ్మ‌నాయ‌కుడు.. సీనియ‌ర్ నేత‌.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను అస‌లు జ‌గ‌న్ ఎక్క‌డా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. నిజానికిఆయ‌న కోర‌కుండానే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని.. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Satya

Recent Posts

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

1 hour ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

2 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

3 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

4 hours ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

6 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

6 hours ago