Political News

క‌మ్మ‌, వైశ్య‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణుల‌కు ద‌క్క‌ని చోటు

సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గ కూర్పులో.. స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న స‌మ‌యంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చి న ఆయ‌న ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగింది. ఎందుకంటే.. వ‌చ్చేది కీల‌క‌మైన ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డంతో.. ఖ‌చ్చితంగా ఈ రెండేళ్ల‌లో ఆయా సామాజిక వ‌ర్గాల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్రభావితం చేస్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి వ‌ర్గ కూర్పుపై అన్ని సామాజిక వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి.

అయితే.. ఊహించ‌ని విధంగా సీఎం జ‌గ‌న్‌.. మంత్రి వ‌ర్గ కూర్పులో కీల‌క‌మైన నాలుగు సామాజిక వ‌ర్గాల ను.. ప‌క్క‌న పెట్టేశారు. వీటిలో అత్యంత కీల‌క‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకా దు.. వైశ్య సామాజిక వ‌ర్గాన్ని కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త మంత్రి వ‌ర్గంలోఈ రెండు వ‌ర్గాల‌కుచెందిన కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఈ ద‌ఫా వీరిని ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు.. కొత్తగా ఎవ‌రినీ తీసుకోలేదు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం.. క్ష‌త్రియ‌. ఈ వ‌ర్గం నుంచి గ‌త కేబినెట్‌లో శ్రీరంగ‌నాథ‌రాజు ఉన్నారు.

అయితే… ఈయ‌న స్థానంలో న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజుకు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని.. ఎప్ప‌టినుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు.. ప్ర‌సాద‌రాజు కూడా.. ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. ఇక‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి గత కేబినెట్లోనూ చోటు ద‌క్క‌లేదు. ద‌రిమిలా.. ఇప్పుడైనా.. చోటు ద‌క్కుతుంద‌ని ఆశించారు. ఈ క్ర‌మంలో డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణులు ఉన్నారు. అయితే.. వీరిలో మ‌ల్లాదికి ఖ‌చ్చితంగా మంత్రి పీఠం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు.

అంతేకాదు.. ఈ నాలుగు సామాజిక వ‌ర్గాల నుంచి ఎవ‌రినీ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది .. జ‌గ‌న్ కూర్పుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రోవైపు.. కొత్త ముఖాలైన విడ‌ద‌ల ర‌జ‌నీ కి అవకాశం క‌ల్పించ‌డంపై.. గుంటూరు రాజ‌కీయం గ‌రంగ‌రంగా మారిపోయింది. ఇక్క‌డే మ‌రో విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ కోసం సీటు త్యాగం చేసిన క‌మ్మ‌నాయ‌కుడు.. సీనియ‌ర్ నేత‌.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను అస‌లు జ‌గ‌న్ ఎక్క‌డా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. నిజానికిఆయ‌న కోర‌కుండానే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని.. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Satya

Recent Posts

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

20 minutes ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

34 minutes ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

40 minutes ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

56 minutes ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

1 hour ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

2 hours ago