Political News

క‌మ్మ‌, వైశ్య‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణుల‌కు ద‌క్క‌ని చోటు

సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గ కూర్పులో.. స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో తొలి కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న స‌మ‌యంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చి న ఆయ‌న ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగింది. ఎందుకంటే.. వ‌చ్చేది కీల‌క‌మైన ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం కావ‌డంతో.. ఖ‌చ్చితంగా ఈ రెండేళ్ల‌లో ఆయా సామాజిక వ‌ర్గాల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్రభావితం చేస్తార‌ని.. అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి వ‌ర్గ కూర్పుపై అన్ని సామాజిక వ‌ర్గాలు ఆశ‌లు పెట్టుకున్నాయి.

అయితే.. ఊహించ‌ని విధంగా సీఎం జ‌గ‌న్‌.. మంత్రి వ‌ర్గ కూర్పులో కీల‌క‌మైన నాలుగు సామాజిక వ‌ర్గాల ను.. ప‌క్క‌న పెట్టేశారు. వీటిలో అత్యంత కీల‌క‌మైన క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకా దు.. వైశ్య సామాజిక వ‌ర్గాన్ని కూడా ప‌క్క‌న పెట్టారు. గ‌త మంత్రి వ‌ర్గంలోఈ రెండు వ‌ర్గాల‌కుచెందిన కొడాలి నాని, వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఈ ద‌ఫా వీరిని ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు.. కొత్తగా ఎవ‌రినీ తీసుకోలేదు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం.. క్ష‌త్రియ‌. ఈ వ‌ర్గం నుంచి గ‌త కేబినెట్‌లో శ్రీరంగ‌నాథ‌రాజు ఉన్నారు.

అయితే… ఈయ‌న స్థానంలో న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజుకు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని.. ఎప్ప‌టినుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు.. ప్ర‌సాద‌రాజు కూడా.. ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు. ఇక‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి గత కేబినెట్లోనూ చోటు ద‌క్క‌లేదు. ద‌రిమిలా.. ఇప్పుడైనా.. చోటు ద‌క్కుతుంద‌ని ఆశించారు. ఈ క్ర‌మంలో డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణులు ఉన్నారు. అయితే.. వీరిలో మ‌ల్లాదికి ఖ‌చ్చితంగా మంత్రి పీఠం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెట్టారు.

అంతేకాదు.. ఈ నాలుగు సామాజిక వ‌ర్గాల నుంచి ఎవ‌రినీ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది .. జ‌గ‌న్ కూర్పుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రోవైపు.. కొత్త ముఖాలైన విడ‌ద‌ల ర‌జ‌నీ కి అవకాశం క‌ల్పించ‌డంపై.. గుంటూరు రాజ‌కీయం గ‌రంగ‌రంగా మారిపోయింది. ఇక్క‌డే మ‌రో విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ కోసం సీటు త్యాగం చేసిన క‌మ్మ‌నాయ‌కుడు.. సీనియ‌ర్ నేత‌.. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను అస‌లు జ‌గ‌న్ ఎక్క‌డా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. నిజానికిఆయ‌న కోర‌కుండానే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని.. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

This post was last modified on April 10, 2022 9:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeatureJagan

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

42 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

45 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago