Political News

గౌతమ్ రెడ్డి ప్లేసులో వచ్చేది ఎవరు?

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నుండి గౌతమ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన హఠాత్తుగా మరణించటంతో ఇపుడా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంలో ఇన్ని రోజులు సస్పెన్స్ నడిచింది. ఫైనల్ గా ఈ సస్పెన్స్ కు మేకపాటి ఫ్యామిలి తెరదించింది. గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.

మేకపాటి సోదరుల తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డికి కబురందింది. తొందరలో జరగబోయే ఆత్మకూరు ఉపఎన్నికలో తన కొడుకు విక్రమ్ రెడ్డిని పోటీచేయించాలని తమ కుటుంబం నిర్ణయించినట్లు రాజమోహన్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ నిర్ణయం తమ కుటుంబం అంతా మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయంగా మాజీ ఎంపీ ప్రకటించారు. దాంతో ఆత్మకూరు సస్పెన్స్ విడిపోయింది.

మొదట్లో గౌతమ్ స్థానంలో ఆయన భార్య శ్రీ కీర్తి రాజకీయాల్లోకి వస్తారని, ఆత్మకూరు నుండి పోటీచేయబోతున్నారనే ప్రచారం బాగా జరిగింది. ఇలా పోటీచేసేయటం అలా గెలిచొచ్చి మంత్రయిపోవటమే మిగిలుందన్నట్లుగా మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే జరిగిన ప్రచారానికి విరుద్ధంగా శ్రీ కీర్తికి బదులు విక్రమ్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.

విక్రమ్ చెన్నై ఐఐటీలో చదువుకుని అమెరికాలో కన్ స్ట్రక్షన్ టెక్నాలజీలో ఎంఎస్ చేశారు. అంటే సోదరుడు గౌతమ్ లాగే విక్రమ్ కూడా బాగా చదువుకున్న వ్యక్తే. ఎలాగూ కుటుంబం తరపున విక్రమ్ పేరు జగన్ కు అందింది కాబట్టి అభ్యర్ధిగా అధికారికంగా పేరును ప్రకటించటం లాంఛనమే అనటంలో సందేహం లేదు. ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా విక్రమే అభ్యర్ధిగా పోటీలోకి దిగటం ఖాయం.

ఇంతవరకు ఓకేనే కానీ తర్వాత మంత్రివర్గంలోనే ఉంటారా లేదా అనేదే సస్పెన్స్. ఎందుకంటే 11వ తేదీన మంత్రివర్గం ఏర్పాటవుతోంది. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీదు. అయితే ఉపఎన్నికలతో సంబంధంలేకుండా కూడా విక్రమ్ ను జగన్ మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. కానీ అలా చేస్తారని అనుకోవటం లేదు.

This post was last modified on April 10, 2022 6:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago