తాను అనుకున్నట్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కొత్త కేబినెట్ ను కొలువు తీర్చిన వేళలో మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని.. కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పిన జగన్ అందుకు తగ్గట్లే.. పాత వారందరి చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించటం తెలిసిందే. కొత్తగాకొలువు తీరే కేబినెట్ సైజు పాతిక మంది కాగా.. వారిలో కొత్త వారు ఎంతమంది? పాతవారు ఎంతమంది? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సోమవారం ఉదయం 11 గంటల వేళలో జరిగే మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించి ఈ రోజు (ఆదివారం) సాయంత్రం లోపు మంత్రుల జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. మొత్తం పాతిక మందిలో పది మంది పాత వారు కొనసాగుతారని.. కొత్తగా 15 మందికి అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. అనుకున్న దాని కంటే ఆలస్యంగా సాగిన కేబినెట్ కూర్పు కసరత్తు.. శనివారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. కొత్త మంత్రుల పేర్లతో కూడిన జాబితాను రాజ్ భవన్ కు పంపటానికి ముందు చివరిక్షణాల్లో ఏదైనా జరిగితే మార్పులు ఉంటాయని చెబుతున్నారు.
తొలుత అందిన సమాచారాన్ని చూసినప్పుడు పాత కేబినెట్ లోని ఐదారుగురికి మించి అవకాశం దక్కదన్న మాట వినిపించింది. కానీ.. అంతలోనే మార్పులుచోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. శుక్ర.. శనివారాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. జగన్ తో భేటీ అయిన కొందరి కారణంగా ఆయన మైండ్ సెట్ లో కాసిన్ని మార్పులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.దీంతో.. మొత్తం పాతిక మందిలో పదిహేను మంది మాత్రమే కొత్త వారు ఉంటారని చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాలేదని.. శనివారం మొత్తం కసరత్తు చేసిన తర్వాత కూడా జగన్ ఒక నిర్ణయానికి రాలేకపోయారని.. దీంతో ఆయన ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నానికి జాబితాను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి తన కొత్తకేబినెట్ లో కొత్త వారుఎంతమంది ఉండాలి.. పాత వారు ఎంత మంది కంటిన్యూ కావాలన్న దానిపై మాత్రం క్లారిటీకి వచ్చారని చెబుతున్నారు. ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాలు నిజమైతే.. మొత్తం 25మందిలో 40 శాతం మంది పాత వారు.. 60 శాతం మంది కొత్త వారు వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on April 10, 2022 10:26 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…