ఏపీలో నియోజకవర్గాల పెంపు, జిల్లాల పెంపు ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం దాదాపుగా తేల్చి చెప్పింది. ఇక, ఏపీలోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయాలన్న అంశానికి మాత్రం సీఎం జగన్ కట్టుబడే ఉన్నారు.
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా చేసుకొని జిల్లాల విభజన చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ హామీని అమలు చేయాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. కొత్త జిల్లాల రూట్ మ్యాప్ పూర్తి చేసి 2021 రిపబ్లిక్ డే నాటికి ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రిపబ్లిక్ డే నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలనను అమలులోకి తేవాలని జగన్ యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేశారని తెలుస్తోంది. జిల్లాల విభజనలో భాగంగా కృష్ణా జిల్లాను రెండుగా విభజించాలని చూస్తున్నారట. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేయాలని కూడా జగన్ ఫిక్స్ అయ్యారట.
పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా.. జిల్లాకో మంత్రి…ఉండాలని జగన్ యోచిస్తున్నారట. దీని వల్ల పాలనా సౌలభ్యం, స్థానిక రాజకీయాలను మరింత దగ్గరుండి గమనించడం వంటివి సులువుగా ఉంటాయని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాను రెండుగా విడగొట్టి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారట.
పాదయాత్రలో ఇదే విషయమై ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఈ విధంగా టీడీపీకి గ్రిప్ ఉన్న ఆ జిల్లాను తమ వైపు తిప్పుకోవాలని జగన్ అనుకుంటున్నారట. ముందుగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే…జిల్లాల విభజనలో నిమ్మకూరు ఎటు వెళుతుందో తెలీదని, అందుకే విభజన తర్వాత నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ ఆలోచన ఇదేనని తెలుస్తోంది. మరోవైపు, విశాఖలో ఒక జిల్లాను గిరిజన జిల్లాగా మార్చి దానికి విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని జగన్ యోచిస్తున్నారట. దాదాపుగా అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టే అవకాశముందని అంటున్నారు. దీంతోపాటు, రాష్ట్రంలోని మరికొన్ని కొత్త జిల్లాలకు ఆయా ప్రాంత ప్రముఖుల పేర్లు పెట్టాలని కూడా వైసీపీ ఆలోచిస్తోందిట.
This post was last modified on June 21, 2020 1:24 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…