Political News

జగన్ ఎన్టీఆర్ జిల్లా ఎపుడు పెడతారంటే…!

ఏపీలో నియోజకవర్గాల పెంపు, జిల్లాల పెంపు ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం దాదాపుగా తేల్చి చెప్పింది. ఇక, ఏపీలోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయాలన్న అంశానికి మాత్రం సీఎం జగన్ కట్టుబడే ఉన్నారు.

పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా చేసుకొని జిల్లాల విభజన చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ హామీని అమలు చేయాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. కొత్త జిల్లాల రూట్ మ్యాప్ పూర్తి చేసి 2021 రిపబ్లిక్ డే నాటికి ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రిపబ్లిక్ డే నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలనను అమలులోకి తేవాలని జగన్ యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేశారని తెలుస్తోంది. జిల్లాల విభజనలో భాగంగా కృష్ణా జిల్లాను రెండుగా విభజించాలని చూస్తున్నారట. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేయాలని కూడా జగన్ ఫిక్స్ అయ్యారట.

పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా.. జిల్లాకో మంత్రి…ఉండాలని జగన్ యోచిస్తున్నారట. దీని వల్ల పాలనా సౌలభ్యం, స్థానిక రాజకీయాలను మరింత దగ్గరుండి గమనించడం వంటివి సులువుగా ఉంటాయని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాను రెండుగా విడగొట్టి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారట.

పాదయాత్రలో ఇదే విషయమై ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఈ విధంగా టీడీపీకి గ్రిప్ ఉన్న ఆ జిల్లాను తమ వైపు తిప్పుకోవాలని జగన్ అనుకుంటున్నారట. ముందుగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే…జిల్లాల విభజనలో నిమ్మకూరు ఎటు వెళుతుందో తెలీదని, అందుకే విభజన తర్వాత నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ ఆలోచన ఇదేనని తెలుస్తోంది. మరోవైపు, విశాఖలో ఒక జిల్లాను గిరిజన జిల్లాగా మార్చి దానికి విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని జగన్ యోచిస్తున్నారట. దాదాపుగా అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టే అవకాశముందని అంటున్నారు. దీంతోపాటు, రాష్ట్రంలోని మరికొన్ని కొత్త జిల్లాలకు ఆయా ప్రాంత ప్రముఖుల పేర్లు పెట్టాలని కూడా వైసీపీ ఆలోచిస్తోందిట.

Satya

Recent Posts

ఢిల్లీ అగ్నిప్రమాదం.. విదేశీయులే ఎక్కువ.. తప్పు ఎక్కడ జరిగింది?

ఢిల్లీలోని మాళవియా నగర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లోరిష్ స్టే అనే హోటల్‌లో ఉదయం చెలరేగిన మంటలు…

40 minutes ago

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

2 hours ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

3 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

4 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

4 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

5 hours ago