ఏపీలో నియోజకవర్గాల పెంపు, జిల్లాల పెంపు ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు తెలంగాణలోనూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం దాదాపుగా తేల్చి చెప్పింది. ఇక, ఏపీలోని 13 జిల్లాలను 25 జిల్లాలు చేయాలన్న అంశానికి మాత్రం సీఎం జగన్ కట్టుబడే ఉన్నారు.
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా చేసుకొని జిల్లాల విభజన చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ హామీని అమలు చేయాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. కొత్త జిల్లాల రూట్ మ్యాప్ పూర్తి చేసి 2021 రిపబ్లిక్ డే నాటికి ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రిపబ్లిక్ డే నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలనను అమలులోకి తేవాలని జగన్ యాక్షన్ ప్లాన్ సిధ్ధం చేశారని తెలుస్తోంది. జిల్లాల విభజనలో భాగంగా కృష్ణా జిల్లాను రెండుగా విభజించాలని చూస్తున్నారట. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేయాలని కూడా జగన్ ఫిక్స్ అయ్యారట.
పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా.. జిల్లాకో మంత్రి…ఉండాలని జగన్ యోచిస్తున్నారట. దీని వల్ల పాలనా సౌలభ్యం, స్థానిక రాజకీయాలను మరింత దగ్గరుండి గమనించడం వంటివి సులువుగా ఉంటాయని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాను రెండుగా విడగొట్టి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీయార్ పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారట.
పాదయాత్రలో ఇదే విషయమై ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారట. ఈ విధంగా టీడీపీకి గ్రిప్ ఉన్న ఆ జిల్లాను తమ వైపు తిప్పుకోవాలని జగన్ అనుకుంటున్నారట. ముందుగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే…జిల్లాల విభజనలో నిమ్మకూరు ఎటు వెళుతుందో తెలీదని, అందుకే విభజన తర్వాత నిమ్మకూరు ఉన్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారట.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వెనుక జగన్ ఆలోచన ఇదేనని తెలుస్తోంది. మరోవైపు, విశాఖలో ఒక జిల్లాను గిరిజన జిల్లాగా మార్చి దానికి విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని జగన్ యోచిస్తున్నారట. దాదాపుగా అరకు జిల్లాకు అల్లూరి పేరు పెట్టే అవకాశముందని అంటున్నారు. దీంతోపాటు, రాష్ట్రంలోని మరికొన్ని కొత్త జిల్లాలకు ఆయా ప్రాంత ప్రముఖుల పేర్లు పెట్టాలని కూడా వైసీపీ ఆలోచిస్తోందిట.
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…