Political News

గ‌తిలేక‌.. ఉద్యోగుల‌తో బేరం ఆడాం

ఏపీలో ఉద్యోగుల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఏర్ప‌డిన పీఆర్సీ వివాదం మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. దీనిపై మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్‌గా నడపటం అభినందనీయమని కొనియడారు. సీఎం జగన్‌కు మనసులేక కాదని, గతిలేక మీతో బేరం ఆడాల్సి వచ్చిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే 27 శాతం ఐఆర్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందని పేర్ని నాని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకనే పీఆర్సీ అంశంలో ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని   నాని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికా రంలోకి రావడంలో ఉద్యోగులు చాలా కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులపై ప్రేమ లేకపోతే సీఎం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఎందుకు ఇస్తారని మంత్రి ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో న్యాయం జరగలేదని కొందరు అంటున్నా రని.., అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితే బాగాలేదనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలన్నారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ పాలనకు రెవెన్యూ అవసరమన్నారు. మన దేశంలో ఎక్కువ మొత్తం పన్నులు పరోక్ష విధానంలో వస్తున్నాయన్నారు. ఇంటిలిజెన్స్, లిటిగేషన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2019 నాటి అప్పల భారం ఇప్పటి ప్రభుత్వంపై పడుతోందని బుగ్గన తెలిపారు.

పీఆర్సీ అమలు చేయగలగుతామనే సీఎం ఉద్యోగులకు హామీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేం దుకు పార్టీలు వస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు.

 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు అన్నీ కలిపినా ఉద్యోగుల జీతాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇబ్బందులు ఉన్నా.. రెవెన్యూ తీసుకురావటంలో వాణిజ్య పన్నులశాఖ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. లొసుగులు వెతికి అదనపు ఆదాయాలు తీసుకురావాల్సిన బాధ్యత వాణిజ్య పన్నుల శాఖదేనని చెప్పారు. వ్యాపారులను వేధించాల్సిన అవసరం లేదని.. ఐదేళ్ల కాలంలోని వివాదాలు, కోర్టు కేసులు బేరీజు వేసుకుని నిబంధనల మార్పుపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు.

This post was last modified on April 7, 2022 7:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

59 seconds ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago