Political News

ఏపీ స‌ర్కారుకు ఏబీవీ లేఖ‌… త‌ప్పు చేయ‌లేద‌ని వెల్ల‌డి

చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావుకు.. ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా పెగాసస్ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వానికి.. సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఉందని.. ఇలాంటి వాటిపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని గుర్తు చేశారు.

“ మీరు(ప్ర‌బుత్వం) రూల్ 6 గురించి అడుగుతున్నారు. నేను రూల్ 17కు అనుగుణంగానే మీడియాతో మాట్లాడా“ అని ఆయ‌న పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ వినియోగించలేదని మాత్రమే చెప్పానని.. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇవ్వవచ్చని ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకత, జవాబుదారీత నంతో ఉండాలని… ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెబుతున్నాయని ఏబీవీ స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదన్న ఏబీవీ… తన గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని స్పష్టంచేశారు. మీడియా సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ను కూడా త‌న వివరణలో ఏబీవీ ప్రస్తావించారు.

ఇదిలావుంటే, ఏబీవీకి  రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిన విష‌యం తెలిసిందే. గతనెల 21న ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం తప్పేనంటూ ఆయనకు మెమో జారీ చేసింది. ఏబీవీ ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించలేదని నోటీసులో పేర్కొంది.

మెమో అందిన వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. లేనిపక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. ఏబీవీ మీడియాతో మాట్లాడడంపై వివరణ కోరుతూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌.. షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 31న ఏబీవీ మీడియా సమావేశంలో పెగాసస్‌తోపాటుగా తన సస్పెన్షన్ అంశాలపై మాట్లాడారు. తాజాగా ఆయ‌న ప్ర‌భుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయ‌న జ‌వాబు చెప్పారు.. మ‌రి ఇప్ప‌డు స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on April 7, 2022 12:51 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 hour ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

2 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

3 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

5 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

6 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

6 hours ago