Political News

తెలంగాణలో టెస్టులు చేయకపోవటం వెనుక ఓవైసీ?

దేశమంతా ఒకలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు మరోలా వ్యవహరించటం ఏమిటన్న విమర్శలు తరచూ వినిపించేవి. మహమ్మారి ఎపిసోడ్ లో నిర్దారణ పరీక్షలు ఎక్కువగా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి ఏ రీతిలో సాగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునే వీలుంటుంది. అందుకు భిన్నంగా అసలు పరీక్షలు చేసే విషయాన్నే వదిలేస్తే.. రోగ లక్షణాలు తెలిసేదెలా? అన్నది ప్రశ్న.

మహమ్మారి నిర్దారణ పరీక్షలు చేయటం ద్వారా.. వ్యాధి మొదట్లో ఉన్నప్పుడే గుర్తించే వీలు ఉంటుంది. దీని ద్వారా వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ.. ఈ చిన్న విషయాల్ని వదిలేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. కేసుల సంఖ్య ఎక్కువైన వేళలో పరీక్షల్ని నిర్వహిస్తోంది. అది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన తర్వాతే.

ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం నిర్దారణ పరీక్షలు ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. తాజాగా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి. మహమ్మారి కట్టడికి సంబంధించి దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ ప్రమాదకరంగా మారిందన్నారు. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుసరించిన విధానమేనని ఆయన ఆరోపిస్తున్నారు.

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. స్నేహితుడైన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వద్దన్నందుకే కేసీఆర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కరోనా టెస్టులు చేయకపోవటానికి కారణం మజ్లిస్ అని.. అందుకే కేంద్ర సహకారంతో తెలంగాణలో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఢిల్లీలోనూ కేంద్రం జోక్యం చేసుకొని ఆరు లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పిన కిషన్ రెడ్డి మాటలు చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు చేయటానికి బీజేపీ రంగంలోకి దిగుతుందన్న విషయాన్ని తనదైన శైలిలో ఆయన సంకేతాలు ఇచ్చారని చెప్పక తప్పదు. కిషన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ సంచలన ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తీరులో రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on June 21, 2020 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

10 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago