Political News

రోడ్డెక్కిన వైసీపీ స‌ర్పంచులు.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌

ఏపీలో అధికార పార్టీ మ‌ద్ద‌తుతో స‌ర్పంచులుగా ఎన్నికైన‌.. నాయ‌కులు రోడ్డెక్కారు. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయి లో నిప్పులు చెరుగుతున్నారు. దీనికి కార‌ణం.. గ్రామాల‌కు కేటాయించిన నిధుల‌ను జ‌గ‌న్ ప్ర‌బుత్వం వాడేసుకోవ‌డ‌మే. దీంతో ఇప్పుడు వైసీపీ మ‌ద్ద‌తుదారులైన స‌ర్పంచులే రోడ్డెక్కి హాహాకారాలు చేస్తున్నారు.  

వికేంద్రీకరణ.. ఇదే మా ప్రభుత్వ మాట..బాట. 3 రాజధానుల ప్రకటనప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటప్పుడూ ఇలా ప్రతీ సందర్భంలోనూ ఇదే ప్రస్తావన. మరి ఇంతలా చెబుతున్న సర్కార్‌.. వికేంద్రీకరణకు ఆయువు పట్టైన పంచాయతీలను మాత్రం గాలికొదిలేసింది. ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన చేయూతను ఇవ్వకపోగా ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లతో పాటు పన్నులతో వచ్చిన ఆదాయాన్ని లాగేసుకుంటోంది. ఫలితంగా పల్లె అవసరాలు తీర్చాల్సిన పంచాయతీలు చేతిలో పైసా నిధుల్లేక అల్లాడుతున్నాయి. పైగా సర్పంచ్‌ పదవులను నామమాత్రం చేస్తూ.. సచివాలయాలకే వైసీపీ సర్కార్‌ పూర్తి పెత్తనం అప్పజెప్పింది.

గ్రామ పంచాయతీలకు విధులు, నిధులతోనే పాలనా వికేంద్రీకరణ సాధ్య‌మ‌వుతుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విధులివ్వకపోగా, వివిధ రూపాల్లో సమకూరిన ఆదాయాన్ని మళ్లించుకుం టోంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ. 12 వందల 45 కోట్ల లాగేసుకుంది. ఇంటి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలంటూ సర్పంచులు, పంచాయతీ సిబ్బంది మెడపై కత్తిపెట్టి వసూలు చేయించిన సొమ్మును ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి పేరిట ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 2 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం.. పంచాయతీలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం వికేంద్రీకరణ ఎలా అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.

పంచాయతీ నిధులు ప్రభుత్వం దొంగిలించిందంటూ విజయవాడలో సర్పంచులు ఆందోళన చేపట్టారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులు గ్రామాలకు జగన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల హక్కులను రక్షించాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం కేటాయించిన రూ.10 వేలకోట్లు జగన్ ప్రభుత్వం… గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల హక్కులను రక్షించాలంటూ నినాదాలు చేశారు. సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలను జీరో చేసిందని సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

నాలుగు నెలల క్రితం 14,15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ.7,660 కోట్లను దారి మళ్లించారని మండిపడ్డారు. డబ్బంతా ఎటు పంపారు… ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కా పత్రం లేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో 12,900 సర్పంచుల వద్ద చిల్లి గవ్వ కూడా లేదని… గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక వసతులు పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధి కోసమే భిక్షాటన చేస్తున్నామంటున్న సర్పంచులతో ఈటీవీ భారత్ ముఖాముఖి

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

32 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago