Political News

తెలంగాణలో కరోనా.. నంబర్ చూస్తే కళ్లు తిరుగుతాయ్

కరోనా టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కేసులు బయటపడతాయన్నది చాలా సింపుల్ లాజిక్. తెలంగాణలో ఇంతకుముందు తక్కువ టెస్టులు చేేసేవాళ్లు. కేసులు కూడా తక్కువగానే ఉండేవి. కానీ కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు తగ్గట్లే కరోనా కేసులు కూడా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు 50-100 మధ్య కేసులకే అమ్మో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రోజూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. నంబర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిన్న తెలంగాణలో రికార్డు స్థాయిలో 499 కేసులు వెలుగు చూశాయి. దీనికే అందరూ షాకైపోయారు. ఐతే శనివారం కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. తొలిసారిగా 500 మార్కు దాటింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం శనివారం 546 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

శనివారం 3500కు పైగా టెస్టులు నిర్వహించగా.. ఏకంగా 1100 దాకా కొత్త కేసులు బయటపడ్డట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూశారు. ఐతే ప్రభుత్వ బులిటెన్లో అందులో సగం కేసులే నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో 80 శాతం పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపుగా ప్రతి ఏరియాలోనూ కరోనా కేసులున్నాయి. కాలనీలో అక్కడక్కడా ఉన్న కేసులు ప్రతి అపార్ట్‌మెంట్‌కూ విస్తరించే స్థాయికి వచ్చేశాయి. టెస్టులు చేస్తే దాదాపుగా ప్రతి వంద మీటర్లలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 వేల మార్కును దాటగా.. 3500 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. 3360 కేసుల దాకా యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య 200 మార్కును దాటింది. మొత్తం ఇప్పటిదాకా కరోనా వల్ల 203 మంది చనిపోయారు.

This post was last modified on June 21, 2020 12:20 am

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

3 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

5 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

5 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

6 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

7 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

7 hours ago