Political News

కరోనా మరణాలు..106వ స్థానంలో భారత్

మహమ్మారి వైరస్ 213 దేశాలపై పంజా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. కరోనా బారినపడి 4,63,465 మంది చనిపోయారు. భారత్ లో కరోనా కేసులు 3,80,532కు చేరాయి. మనదేశంలో 12,573 మంది కరోనా బారిన పడి మరణించారు. కొవిడ్‌-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్‌’ ప్రకారం పలు ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 మరణాల్లో తొలి స్థానంలో అమెరికా ఉండగా…8వ స్థానంలో భారత్ ఉంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన కొవిడ్‌-19 మరణాలలో దక్షిణ యూరోప్‌లోని అతిచిన్న దేశం సాన్‌ మారినో తొలిస్థానంలో నిలిచింది. 61 చ.కి.మీ వైశాల్యం, 34వేల కన్నా తక్కువ జనాభాగల ఈ దేశం అనూహ్యంగా తొలి స్థానంలో ఉండడం విశేషం. అయితే, కరోనా విలయతాండవం చేసిన ఇటలీ సమీపంలో ఉండటం సాన్ మారినోపాలిట శాపంమైంది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రతి 10 లక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య భారత్ లో తొమ్మిదిగా ఉంది. ఈ విషయంలో ప్రపంచ జాబితాలో భారత్ 106వ స్థానంలో ఉంది.

కోవిడ్-19 మరణాల్లో తొలి 8 స్థానాల్లో ఉన్న దేశాలు (సంఖ్యా పరంగా)

అమెరికా( 1,20,688 )
బ్రెజిల్‌ (47869)
బ్రిటన్‌ (42288)
ఇటలీ (34515)
ఫ్రాన్స్‌ (29603)
స్పెయిన్‌ (27136)
మెక్సికో (19749)
భారత్ (12,573)

ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన మరణాల ప్రకారం…

సాన్‌ మారినో (1,238)
బెల్జియం (836)
అండోరా (673)
బ్రిటన్ (623)
స్పెయిన్‌ (580)
ఇటలీ (571)
స్వీడన్ (500)‌
ఫ్రాన్స్ (454)‌
అమెరికా (365)
నెదర్లాండ్స్‌ (355)
భారతదేశం (9)

అంటే మనదేశంలో ఈ పాండెమిక్ తీవ్రత మరణాల పరంగా తక్కువ అనుకోవాలన్నమాట.

This post was last modified on June 20, 2020 10:04 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago