Political News

కరోనా మరణాలు..106వ స్థానంలో భారత్

మహమ్మారి వైరస్ 213 దేశాలపై పంజా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. కరోనా బారినపడి 4,63,465 మంది చనిపోయారు. భారత్ లో కరోనా కేసులు 3,80,532కు చేరాయి. మనదేశంలో 12,573 మంది కరోనా బారిన పడి మరణించారు. కొవిడ్‌-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్‌’ ప్రకారం పలు ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 మరణాల్లో తొలి స్థానంలో అమెరికా ఉండగా…8వ స్థానంలో భారత్ ఉంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన కొవిడ్‌-19 మరణాలలో దక్షిణ యూరోప్‌లోని అతిచిన్న దేశం సాన్‌ మారినో తొలిస్థానంలో నిలిచింది. 61 చ.కి.మీ వైశాల్యం, 34వేల కన్నా తక్కువ జనాభాగల ఈ దేశం అనూహ్యంగా తొలి స్థానంలో ఉండడం విశేషం. అయితే, కరోనా విలయతాండవం చేసిన ఇటలీ సమీపంలో ఉండటం సాన్ మారినోపాలిట శాపంమైంది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రతి 10 లక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య భారత్ లో తొమ్మిదిగా ఉంది. ఈ విషయంలో ప్రపంచ జాబితాలో భారత్ 106వ స్థానంలో ఉంది.

కోవిడ్-19 మరణాల్లో తొలి 8 స్థానాల్లో ఉన్న దేశాలు (సంఖ్యా పరంగా)

అమెరికా( 1,20,688 )
బ్రెజిల్‌ (47869)
బ్రిటన్‌ (42288)
ఇటలీ (34515)
ఫ్రాన్స్‌ (29603)
స్పెయిన్‌ (27136)
మెక్సికో (19749)
భారత్ (12,573)

ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన మరణాల ప్రకారం…

సాన్‌ మారినో (1,238)
బెల్జియం (836)
అండోరా (673)
బ్రిటన్ (623)
స్పెయిన్‌ (580)
ఇటలీ (571)
స్వీడన్ (500)‌
ఫ్రాన్స్ (454)‌
అమెరికా (365)
నెదర్లాండ్స్‌ (355)
భారతదేశం (9)

అంటే మనదేశంలో ఈ పాండెమిక్ తీవ్రత మరణాల పరంగా తక్కువ అనుకోవాలన్నమాట.

This post was last modified on June 20, 2020 10:04 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

50 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago