Political News

కరోనా మరణాలు..106వ స్థానంలో భారత్

మహమ్మారి వైరస్ 213 దేశాలపై పంజా విసిరింది. ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. కరోనా బారినపడి 4,63,465 మంది చనిపోయారు. భారత్ లో కరోనా కేసులు 3,80,532కు చేరాయి. మనదేశంలో 12,573 మంది కరోనా బారిన పడి మరణించారు. కొవిడ్‌-19కు సంబంధించి తాజా గణాంకాలను అందించే అంతర్జాతీయ సంస్థ ‘వరల్డో మీటర్‌’ ప్రకారం పలు ఆసక్తికర గణాంకాలు వెల్లడయ్యాయి. కోవిడ్-19 మరణాల్లో తొలి స్థానంలో అమెరికా ఉండగా…8వ స్థానంలో భారత్ ఉంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన కొవిడ్‌-19 మరణాలలో దక్షిణ యూరోప్‌లోని అతిచిన్న దేశం సాన్‌ మారినో తొలిస్థానంలో నిలిచింది. 61 చ.కి.మీ వైశాల్యం, 34వేల కన్నా తక్కువ జనాభాగల ఈ దేశం అనూహ్యంగా తొలి స్థానంలో ఉండడం విశేషం. అయితే, కరోనా విలయతాండవం చేసిన ఇటలీ సమీపంలో ఉండటం సాన్ మారినోపాలిట శాపంమైంది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రతి 10 లక్షల జనాభాకు కరోనా మరణాల సంఖ్య భారత్ లో తొమ్మిదిగా ఉంది. ఈ విషయంలో ప్రపంచ జాబితాలో భారత్ 106వ స్థానంలో ఉంది.

కోవిడ్-19 మరణాల్లో తొలి 8 స్థానాల్లో ఉన్న దేశాలు (సంఖ్యా పరంగా)

అమెరికా( 1,20,688 )
బ్రెజిల్‌ (47869)
బ్రిటన్‌ (42288)
ఇటలీ (34515)
ఫ్రాన్స్‌ (29603)
స్పెయిన్‌ (27136)
మెక్సికో (19749)
భారత్ (12,573)

ప్రతి 10 లక్షల మంది జనాభాకు సంభవించిన మరణాల ప్రకారం…

సాన్‌ మారినో (1,238)
బెల్జియం (836)
అండోరా (673)
బ్రిటన్ (623)
స్పెయిన్‌ (580)
ఇటలీ (571)
స్వీడన్ (500)‌
ఫ్రాన్స్ (454)‌
అమెరికా (365)
నెదర్లాండ్స్‌ (355)
భారతదేశం (9)

అంటే మనదేశంలో ఈ పాండెమిక్ తీవ్రత మరణాల పరంగా తక్కువ అనుకోవాలన్నమాట.

This post was last modified on June 20, 2020 10:04 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago