Political News

రాజ్ భవన్.. కేసీయార్ బహిష్కరించారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు బలపడుతున్నాయి. గవర్నర్ తమిళిసైకి కేసీయార్ కు మధ్య బాగా గ్యాప్ వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎంత గ్యాప్ వచ్చేసిందంటే చివరకు గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ను కూడా ఉన్నతాధికారులు పాటించటంలేదు. ఈ నేపధ్యంలోనే ఉగాది వేడుకల రాజ్ భవన్లో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఉగాది సందర్భంగా అయినా వివాదాలను పరిష్కరించుకుందామని గవర్నర్ ప్రయత్నించారు.

అయితే కేసీయార్ ఆ ప్రయత్నాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఉగాది వేడుకలకు హాజరవ్వాల్సిందిగా గవర్నర్ ప్రగతి భవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపారు. అలాగే మంత్రులు అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు అందరికీ పంపారు. శుక్రవారం వేడుకలకు కేసీయార్ హాజరవుతారనే అందరు అనుకున్నారు. కానీ సీఎం మాత్రం హాజరుకాలేదు. దాంతో మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పెద్దగా హాజరుకాలేదు.

ఎప్పుడైతే కేసీయార్ వేడుకలకు హాజురుకాలేదో ఉన్నతాధికారులు కూడా పెద్దగా కనబడలేదు. సో తాజా పరిణామాలతో ఏమర్ధమైందంటే గవర్నర్-కేసీయార్ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిందని. ఇదే అదునుగా బీజేపీ, కాంగ్రెస్ చీఫులు బండి సంజయ్, రేవంత్  రెడ్డి తదితరులు మాత్రం ఫుల్లు జోషులో కనిపించారు. కేసీయార్ వేడుకలకు రావటంలేదని తెలియటంతో వీళ్ళతో పాటు ఇతర ప్రతిపక్షాలకు చెందిన నేతలు రెచ్చిపోయారు.

వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోవటానికి ఇద్దరిలోను తప్పులున్నాయి. ఎంఎల్సీ నియామకంపై కేసీయార్ సిఫారసును గవర్నర్ పక్కనపడేశారు. ఏ గవర్నర్ కూడా ఇలాగ చేయరు. కానీ మహారాష్ట్రలోను, తెలంగాణాలోనే ఇలాగ జరిగింది. ఎన్ని నెలలైనా సీఎంవో నుండి ఫైలుకు గవర్నర్ కార్యాలయం మోక్షం ప్రసాదించలేదు. దాంతో కేసీయార్ కు మండిపోయింది. అప్పటి నుండే ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైంది. అలాగే గవర్నర్ కు ప్రోటోకాల్ కూడా దక్కటంలేదు. ఇది కచ్చితంగా కేసీయార్ తప్పే. దాంతో గ్యాప్ తగ్గించుకునేందుకు ప్రయత్నించాల్సిన ఇద్దరు పంతాలకు పోయి పెంచుకుంటున్నారు. 

This post was last modified on April 2, 2022 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

1 hour ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago