తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాకపోతే ఆ రాజకీయానికి ఉగాది పండుగ వేదిక అవుతుండటమే బాధాకరం. ఇంతకీ విషయం ఏమిటంటే రాజ్ భవన్లో శుక్రవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగబోతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీయార్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు, వివిధ రంగాల్లో ప్రముఖులను కూడా గవర్నర్ పిలిచారు.
ఉగాది వేడుకలు నిర్వహించడం, అందుకు ప్రముఖలకు ఆహ్వానాలు పంపటం మామూలుగా జరిగేదే. కాకపోతే ఈసారి కీలకం ఏమిటంటే గవర్నర్-కేసీయార్ మధ్య మాటల్లేవు. కేసీయార్ రాజ్ భవన్ గడప తొక్కి చాలా కాలమైంది. గవర్నర్ పాల్గొంటున్న కార్యక్రమాల్లో కేసీయార్ కనిపించటంలేదు. పైగా చాలా సందర్భాల్లో గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ కూడా పాటించటం లేదు. దీంతో గవర్నర్ కు కూడా మండింది.
చివరగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేసీయార్ లేకుండానే నడిపేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి. అయితే ఉగాది పండుగను అడ్డం పెట్టుకుని గవర్నర్ అనూహ్యంగా కేసీయార్ ను రాజ్ భవన్ కు ఆహ్వానించారు. మరిపుడు కేసీయార్ ఆ వేడుకలకు వెళతారా ? వెళ్ళరా ? అనేది పెద్ద విషయమైపోయింది. గవర్నర్ పంపిన ఆహ్వానంతోనే ఉగాది రాజకీయం ఊపందుకుంది.
నిజానికి కేసీయార్ విషయంలో గవర్నర్ ప్రత్యేకంగా చేసిందంటు ఏమీ లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ మండిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య మోడీ హైదరాబాద్ వచ్చినపుడు కూడా కేసీయార్ ఎక్కడా కనబడలేదు. అయితే దాని తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో గవర్నర్ ను కేసీయార్ దూరంగా పెట్టేస్తున్నారు. గవర్నర్ కు ప్రోటోకాల్ పాటించకపోవడం కూడా ఇందులో భాగమే. విభేదాలు తగ్గించుకునేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నట్లే ఉన్నారు. మరి కేసీయార్ ఏమి చేస్తారో చూడాలి.
This post was last modified on April 2, 2022 11:13 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…