Political News

వైసీపీ నేత దారుణమైన ‘రేప్’ కామెంట్

ఏపీలో రాజకీయం రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఇటు అసెంబ్లీలో, అటు బయట మీడియా ముందు, అలాగే టీవీ ఛానెళ్ల చర్చల్లో రాజకీయ నాయకులు ఎంతగా అదుపు తప్పి పోతున్నారో తెలిసిందే. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకైతే అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే వాళ్లు చేసిన అనేక వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. జుగుప్స కలిగించే మాటలతో రాజకీయాలపై జనాలకు మరింత ఏహ్యభావం కలిగేలా చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఒక వైసీపీ నేత మరింత దిగజారుడు మాటలతో అందరినీ షాక్‌కు గురి చేశారు.

ఒక టీవీ ఛానెల్ చర్చలో భాగంగా మూర్తి అనే వైకాపా నేత.. తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి గ్రీష్మ అనే మహిళా నేత మీద దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన అదుపు తప్పిపోయారు.ఆంధ్రప్రదేశ్‌లోమహిళల భద్రత ప్రమాదంలో ఉందని.. రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదంటూ కావలి గ్రీష్మ వాదన లేవనెత్తారు. ఇందుకు ఇటీవలి ఉదంతాలు కొన్ని ఉదహరించారు.

ఐతే దీనిపై వైకాపా నేత అయిన మూర్తి ఎదురు దాడి చేసే క్రమంలో దారుణమైన కామెంట్ చేశారు. ఈమెను మెంటల్ హాస్పిటల్లో చూపించండి అంటూ మొదలుపెట్టిన ఆయన.. ‘‘ఎవరి చేత నువ్వు మానభంగం చేసుకున్నావు? నిన్ను ఎవరైనా మానభంగం చేశారా? నిన్ను ఎవరైనా మానభంగం చేశారా?  నువ్వు ఏపీలోనే ఉన్నావా?’’ అంటూ అదే రెట్టించి రెట్టించి అడిగారు.

ఏపీలో జరుగుతున్న ఉదంతాల గురించి ఉదాహరణలతో చెబుతుంటే.. నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడగడం దారుణాతి దారుణం. దీనికి గ్రీష్మ స్పందిస్తూ.. కొడాలి నాని దగ్గర క్రాష్ కోర్సు చేశారా, ఇలాంటి వాళ్లతో నేను మాట్లాడను అంటూ మిన్నకుండిపోయారు. దీనిపై తెలుగుదేశం నేత నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడుతున్న వైకాపన్లకి మహిళా శక్తి ఏంటో చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

31 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

రాజాసాబ్‌ ఫలితంతో నాకు స‌బంధం లేదు – ఎస్కేఎన్

ప్ర‌భాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌ట‌వుతుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ సినిమా…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

5 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago