ఏపీ సీఎం జగన్కు ఒకే రోజు ఏపీ హైకోర్టులో రెండు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒకటి.. పాఠశాలల్లో సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన హైకోర్టు.. ఏకంగా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఐఏఎస్ అధికా రులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. వారు క్షమాపణ చెప్పినా.. వెనక్కి తగ్గని కోర్టు.. వారికి సేవను శిక్షగా విధించింది. పాఠశాలల్లో.. నెలకు ఒకరోజు సేవ చేయాలని… ఒక రోజుకోర్టు ఖర్చులు ఇవ్వాలని.. ఆదేశించింది.
పాఠశాలల్లో మధ్య హ్న భోజన ఖర్చునుకూడా ఐఏఎస్లు భరించాలని ఆదే శించింది. ఈ షాక్ నుంచి సర్కారు కోలుకోకముందే.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని.. నిలదీసింది. అంతేకాదు… గడువు లోగా .. వారిని ప్రభుత్వమే పక్కన పెట్టాలని… లేక పోతే.. తామే జోక్యం చేసుకుంటామని.. అప్పుడు చాలా సీరియస్ గా ఉంటుందనని హైకోర్టు హెచ్చరించింది.
వైస్ ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి, తిరుపతి నేత భానుప్రకాశ్ రెడ్డి వేసిన పిటిషన్పై గురువారం హైకోర్టు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా.. హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. “ఈ పని ప్రభుత్వమే చేస్తే.. మంచిది..మేం జోక్యం చేసుకుంటే… ఫలితాలు వేరుగా ఉంటాయి“ అని సీరియస్ కామెంట్లు చేసింది.
నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్ 19న కేసు వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వేయిదా వేసింది. మరి ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on March 31, 2022 9:40 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…