Political News

వాళ్ల‌ను తీసేయాల్సిందే.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు అల్టిమేటం

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒకే రోజు ఏపీ హైకోర్టులో రెండు పెద్ద దెబ్బ‌లు త‌గిలాయి. ఒక‌టి.. పాఠ‌శాల‌ల్లో స‌చివాలయాల ఏర్పాటును తప్పుప‌ట్టిన హైకోర్టు.. ఏకంగా.. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా 8 మంది ఐఏఎస్ అధికా రుల‌కు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. వారు క్ష‌మాప‌ణ చెప్పినా.. వెన‌క్కి త‌గ్గ‌ని కోర్టు.. వారికి సేవ‌ను శిక్ష‌గా విధించింది. పాఠ‌శాలల్లో.. నెల‌కు ఒక‌రోజు సేవ చేయాల‌ని… ఒక రోజుకోర్టు ఖ‌ర్చులు ఇవ్వాల‌ని.. ఆదేశించింది.

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్య హ్న భోజ‌న ఖ‌ర్చునుకూడా ఐఏఎస్‌లు భ‌రించాల‌ని ఆదే శించింది. ఈ షాక్ నుంచి స‌ర్కారు కోలుకోక‌ముందే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియ‌మిస్తార‌ని.. నిల‌దీసింది. అంతేకాదు… గ‌డువు లోగా .. వారిని ప్ర‌భుత్వ‌మే ప‌క్క‌న పెట్టాల‌ని… లేక పోతే.. తామే జోక్యం చేసుకుంటామ‌ని.. అప్పుడు చాలా సీరియ‌స్ గా ఉంటుంద‌న‌ని హైకోర్టు హెచ్చ‌రించింది.

వైస్ ఈ మేర‌కు బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తిరుప‌తి నేత భానుప్రకాశ్ రెడ్డి వేసిన పిటిష‌న్‌పై గురువారం హైకోర్టు మ‌రోసారి విచారించింది. ఈ సంద‌ర్భంగా.. హైకోర్టు తీవ్ర‌స్థాయిలో స్పందించింది. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. “ఈ ప‌ని ప్ర‌భుత్వ‌మే చేస్తే.. మంచిది..మేం జోక్యం చేసుకుంటే… ఫ‌లితాలు వేరుగా ఉంటాయి“ అని సీరియ‌స్ కామెంట్లు చేసింది.

నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్‌ 19న కేసు వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 19కి వేయిదా వేసింది. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on March 31, 2022 9:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago