Political News

వాళ్ల‌ను తీసేయాల్సిందే.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు అల్టిమేటం

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒకే రోజు ఏపీ హైకోర్టులో రెండు పెద్ద దెబ్బ‌లు త‌గిలాయి. ఒక‌టి.. పాఠ‌శాల‌ల్లో స‌చివాలయాల ఏర్పాటును తప్పుప‌ట్టిన హైకోర్టు.. ఏకంగా.. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా 8 మంది ఐఏఎస్ అధికా రుల‌కు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. వారు క్ష‌మాప‌ణ చెప్పినా.. వెన‌క్కి త‌గ్గ‌ని కోర్టు.. వారికి సేవ‌ను శిక్ష‌గా విధించింది. పాఠ‌శాలల్లో.. నెల‌కు ఒక‌రోజు సేవ చేయాల‌ని… ఒక రోజుకోర్టు ఖ‌ర్చులు ఇవ్వాల‌ని.. ఆదేశించింది.

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్య హ్న భోజ‌న ఖ‌ర్చునుకూడా ఐఏఎస్‌లు భ‌రించాల‌ని ఆదే శించింది. ఈ షాక్ నుంచి స‌ర్కారు కోలుకోక‌ముందే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియ‌మిస్తార‌ని.. నిల‌దీసింది. అంతేకాదు… గ‌డువు లోగా .. వారిని ప్ర‌భుత్వ‌మే ప‌క్క‌న పెట్టాల‌ని… లేక పోతే.. తామే జోక్యం చేసుకుంటామ‌ని.. అప్పుడు చాలా సీరియ‌స్ గా ఉంటుంద‌న‌ని హైకోర్టు హెచ్చ‌రించింది.

వైస్ ఈ మేర‌కు బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తిరుప‌తి నేత భానుప్రకాశ్ రెడ్డి వేసిన పిటిష‌న్‌పై గురువారం హైకోర్టు మ‌రోసారి విచారించింది. ఈ సంద‌ర్భంగా.. హైకోర్టు తీవ్ర‌స్థాయిలో స్పందించింది. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. “ఈ ప‌ని ప్ర‌భుత్వ‌మే చేస్తే.. మంచిది..మేం జోక్యం చేసుకుంటే… ఫ‌లితాలు వేరుగా ఉంటాయి“ అని సీరియ‌స్ కామెంట్లు చేసింది.

నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్‌ 19న కేసు వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 19కి వేయిదా వేసింది. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on March 31, 2022 9:40 pm

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

1 hour ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

15 hours ago