Political News

వాళ్ల‌ను తీసేయాల్సిందే.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు అల్టిమేటం

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఒకే రోజు ఏపీ హైకోర్టులో రెండు పెద్ద దెబ్బ‌లు త‌గిలాయి. ఒక‌టి.. పాఠ‌శాల‌ల్లో స‌చివాలయాల ఏర్పాటును తప్పుప‌ట్టిన హైకోర్టు.. ఏకంగా.. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా 8 మంది ఐఏఎస్ అధికా రుల‌కు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. వారు క్ష‌మాప‌ణ చెప్పినా.. వెన‌క్కి త‌గ్గ‌ని కోర్టు.. వారికి సేవ‌ను శిక్ష‌గా విధించింది. పాఠ‌శాలల్లో.. నెల‌కు ఒక‌రోజు సేవ చేయాల‌ని… ఒక రోజుకోర్టు ఖ‌ర్చులు ఇవ్వాల‌ని.. ఆదేశించింది.

పాఠ‌శాల‌ల్లో మ‌ధ్య హ్న భోజ‌న ఖ‌ర్చునుకూడా ఐఏఎస్‌లు భ‌రించాల‌ని ఆదే శించింది. ఈ షాక్ నుంచి స‌ర్కారు కోలుకోక‌ముందే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టు మ‌రో షాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. నేర చరిత్ర గలవారికి చోటివ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నేరచరితులను టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియ‌మిస్తార‌ని.. నిల‌దీసింది. అంతేకాదు… గ‌డువు లోగా .. వారిని ప్ర‌భుత్వ‌మే ప‌క్క‌న పెట్టాల‌ని… లేక పోతే.. తామే జోక్యం చేసుకుంటామ‌ని.. అప్పుడు చాలా సీరియ‌స్ గా ఉంటుంద‌న‌ని హైకోర్టు హెచ్చ‌రించింది.

వైస్ ఈ మేర‌కు బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తిరుప‌తి నేత భానుప్రకాశ్ రెడ్డి వేసిన పిటిష‌న్‌పై గురువారం హైకోర్టు మ‌రోసారి విచారించింది. ఈ సంద‌ర్భంగా.. హైకోర్టు తీవ్ర‌స్థాయిలో స్పందించింది. నేరచరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. అందరినీ కాకపోయినా.. కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. “ఈ ప‌ని ప్ర‌భుత్వ‌మే చేస్తే.. మంచిది..మేం జోక్యం చేసుకుంటే… ఫ‌లితాలు వేరుగా ఉంటాయి“ అని సీరియ‌స్ కామెంట్లు చేసింది.

నేరచరితులు పాలకవర్గంలో ఉండరాదన్న హైకోర్టు.. ఏప్రిల్‌ 19న కేసు వాదనలు వింటామని అదే రోజు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 19కి వేయిదా వేసింది. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on March 31, 2022 9:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

1 hour ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

3 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

4 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

5 hours ago